NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / SSC Public Exams 2025: తెలంగాణాలో రేపట్నుంచి పదో క్లాస్ పబ్లిక్‌ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    SSC Public Exams 2025: తెలంగాణాలో రేపట్నుంచి పదో క్లాస్ పబ్లిక్‌ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే!
    తెలంగాణాలో రేపట్నుంచి పదో క్లాస్ పబ్లిక్‌ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే!

    SSC Public Exams 2025: తెలంగాణాలో రేపట్నుంచి పదో క్లాస్ పబ్లిక్‌ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 20, 2025
    01:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రేపటి నుంచి (మార్చి 21) ప్రారంభం కానున్నాయి.

    ఈ పరీక్షలు మార్చి 21న ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు.

    ఇంటర్మీడియట్‌ పరీక్షల మాదిరిగానే పదో తరగతి పరీక్షలకు కూడా ఐదు నిమిషాల గ్రేస్ టైమ్ ఇస్తామని విద్యాశాఖ ప్రకటించింది.

    ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుండగా, 9:35 గంటల వరకు ఆలస్యంగా వచ్చే విద్యార్థులకు అనుమతి ఉంటుందని, అయితే 9:35 తర్వాత వచ్చే వారికి అనుమతి ఉండదని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు తెలిపారు.

    హాల్‌టికెట్లు ఇప్పటికే విడుదల చేశామని, విద్యార్థులు వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

    వివరాలు 

    పరీక్షల ముఖ్యాంశాలు 

    రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

    మొత్తం 5,09,403 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.

    కాంపోజిట్ పేపర్లకు పరీక్ష రాసే విద్యార్థులకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

    విద్యార్థులకు ముఖ్య సూచనలు

    24 పేజీల బుక్‌లెట్: ఈ ఏడాది తొలిసారిగా విద్యార్థులకు 24 పేజీల బుక్‌లెట్‌ను అందించనున్నారు. విద్యార్థులు అందులోనే సమాధానాలు రాయాలి. అవసరమైనప్పుడు అదనపు పేజీలు కూడా ఇస్తారు.

    ప్రశ్నపత్రంపై QR కోడ్: ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు, ఈసారి తొలిసారిగా ప్రతి ప్రశ్నపత్రంపై QR కోడ్ ముద్రించనున్నారు.

    యూనిక్ నంబర్: ఒక్కో ప్రశ్నపత్రంపై ప్రత్యేకమైన యూనిక్ నంబర్‌ను ముద్రించనున్నారు. ప్రశ్నపత్రంలోని అన్ని పేజీల్లో అదే నంబర్ ఉంటుంది.

    వివరాలు 

    విద్యార్థులకు ముఖ్య సూచనలు

    విభాగాల వారీగా సైన్స్ పరీక్షలు: భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం పేపర్లను వేర్వేరుగా రెండు రోజుల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు మాత్రమే జరుగుతాయి.

    గ్రాఫ్ పేపర్: గణితం పరీక్ష రోజున గ్రాఫ్ పేపర్‌ను విడిగా అందిస్తారు.

    సీసీ కెమెరాల నిఘా: సీడీవో గదుల్లో ప్రశ్నపత్రాల బండిల్స్‌ను సీసీ కెమెరాల నిఘాలోనే తెరవనున్నారు.

    సహాయ కేంద్రం: పరీక్షలకు సంబంధించిన సందేహాలు, సమస్యల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు 040-23230942 నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Andhra Pradesh: క్రీడా రంగానికి బూస్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ఆంధ్రప్రదేశ్
    Amritsar: 'భయపడాల్సిన అవసరం లేదు': అమృతసర్​ లో మళ్లీ మోగిన సైరన్.. ఇళ్లలోనుంచి బయటకు రావద్దని హెచ్చరికలు అమృత్‌సర్
    Operation Sindoor: చండీగఢ్'​లో ఎయిర్ సైరన్​  హెచ్చరిక ఆపరేషన్‌ సిందూర్‌
    Operation Sindoor: గుజరాత్‌ పోర్ట్‌పై దాడి..? నకిలీ వీడియో అంటూ ఖండించిన పీఐబీ గుజరాత్

    తెలంగాణ

    AP-Telangana: తెలంగాణ-ఏపీకి కొత్త కనెక్షన్..  కృష్ణా నదిపై తొలి కేబుల్ బ్రిడ్జి! ఆంధ్రప్రదేశ్
    TG GOVT: నేతన్నలకు గుడ్‌న్యూస్.. రూ.లక్ష రుణమాఫీకి ప్రభుత్వ ఉత్తర్వులు! రేవంత్ రెడ్డి
    SLBC: శ్రీశైలం సొరంగం ప్రమాదం.. 16 రోజుల తర్వాత మృతదేహం వెలికితీత  శ్రీశైలం
    TG Group1 Results: తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు నేడే విడుదల.. ఇంటర్వ్యూకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025