NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tenth Students: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Tenth Students: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ 
    తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

    Tenth Students: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 30, 2025
    11:16 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది.

    రాష్ట్రంలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించబడతాయి.

    ఇప్పటికే ఈ షెడ్యూల్ విడుదల అయింది. ఈ నేపథ్యంలో, ఈసారి ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఆదేశించారు.

    ఇప్పటికే ఈ ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    వివరాలు 

    ఒక్కో విద్యార్థికి రోజుకు రూ. 15 ఖర్చు

    ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు విద్యార్థులకు స్నాక్స్ అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

    ఈ సందర్భంగా, విద్యాశాఖ అధికారులు స్నాక్స్ మెనూ రూపొందించారు.

    ఆరు రకాల స్నాక్స్ ఇవ్వాలని నిర్ణయించడంతో, ఒక్కో విద్యార్థికి రోజుకు రూ. 15 ఖర్చు చేయాలని నిర్ణయించారు.

    ఈ స్నాక్స్ లో ఉడకబెట్టిన పెసర్లు, బొబ్బర్లు, పల్లీపట్టి, మిల్లెట్ బిస్కెట్లు, ఉల్లిగడ్డ పకోడీ, ఉల్లిగడ్డ శనగలు ఇచ్చేలా నిర్ణయించారు.

    ఈ నిధులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఖతాల్లో జమ చేయనున్నారు.

    రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ క్లాస్ విద్యార్థులకు టీచర్లు మరియు ఎన్జీవోల ద్వారా స్నాక్స్ అందిస్తున్నట్లు సమాచారం.

    వివరాలు 

     మార్చి 21 నుంచి టెన్త్ పరీక్షలు.. 

    ప్రస్తుతం అన్ని పాఠశాలల్లోనూ, ప్రత్యేక తరగతులకు హాజరయ్యే టెన్త్ విద్యార్థులకు స్నాక్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు, టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    ఇదిలా ఉండగా, తెలంగాణలో టెన్త్ పరీక్షలు మార్చి 21 నుంచి ప్రారంభం కానున్నాయి.

    ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించబడతాయి.

    ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    తెలంగాణ

    New Liquor Brands: మద్యం కంపెనీల అనుమతులపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు రేవంత్ రెడ్డి
    TG 10th Public Exams Fee: తెలంగాణలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఫీజు గడువు పెంపు ఇండియా
    Padi kaushik Reddy: కరీంనగర్ కలెక్టరేట్‌లో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై మూడు కేసులు కరీంనగర్
    Cultivation of vegetables: సర్కారు బడిలో కూరగాయల సాగు.. భోజనంతో పాటు విద్యా వికాసం పెద్దపల్లి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025