NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Half Day Schools: తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన.. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు 
    తదుపరి వార్తా కథనం
    Half Day Schools: తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన.. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు 
    తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన.. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు

    Half Day Schools: తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన.. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 13, 2025
    03:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.

    ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ అధికారిక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ యాజమాన్యంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 23 వరకు ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగనున్నట్లు పేర్కొంది.

    విద్యార్థులకు మధ్యాహ్న భోజనం 12.30 గంటలకు అందించి ఇంటికి పంపనున్నారు.

    వివరాలు 

    పరీక్షలకు ప్రత్యేక తరగతులు

    పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ తెలిపారు.

    అయితే, ఎస్‌ఎస్‌సీ పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయని స్పష్టం చేశారు.

    2024-25 విద్యా సంవత్సరంలో చివరి రోజు అయిన ఏప్రిల్‌ 23 వరకు ఒంటిపూట బడులు అమలులో ఉంటాయని తెలియజేశారు.

    ఈ మార్గదర్శకాలను అన్ని విద్యా సంస్థలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచనలు అందించామని వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Virender Sehwag: పాక్‌కు మర్చిపోలేని సమాధానం అందుతుంది.. భారత సైన్యానికి సెహ్వాగ్ మద్దతు వీరేంద్ర సెహ్వాగ్
    Vikram Misri: పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయంపై ఐఎంఎఫ్‌లో తన వాదన వినిపించనున్న భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    Pakistan: భారతదేశంతో ఉద్రిక్తతల మధ్య.. ఆర్థిక సహాయం కోసం పంచ బ్యాంకు'ను సంప్రదించిన పాకిస్తాన్  పాకిస్థాన్
    Omar Abdullah: అత్యవసరంగా జమ్మూకు ఒమర్‌ అబ్దుల్లా.. పరిస్థితిని సమీక్షించనున్న సీఎం  ఒమర్ అబ్దుల్లా

    తెలంగాణ

    Inter Exams: ఇంటర్ బోర్డు నూతన నిబంధన.. ఈసారి అలస్యమైనా అవకాశం ఇండియా
    Bandi Sanjay: ఎమ్మెల్సీగా గెలుపు.. బీజేపీనే ప్రధాన ప్రతిపక్షం: బండి సంజయ్  బండి సంజయ్
    Hyderabad: హైదరాబాద్‌ రోడ్లపై మళ్లీ చెత్త డబ్బాలు! హైదరాబాద్
    LRS: ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. 10 రోజుల్లోనే సమస్య పరిష్కారం! ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025