English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణ: మహబూబాబాద్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణ: మహబూబాబాద్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి
    మహబూబాబాద్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి

    తెలంగాణ: మహబూబాబాద్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి

    వ్రాసిన వారు Stalin
    Feb 11, 2023
    05:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సికింద్రాబాద్-విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై మహబూబాబాద్ సమీపంలో శుక్రవారం గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదని, రాళ్లదాడి కారణంగా ఒక కిటికీ పగిలిపోయిందని వార్తా సంస్థ పీటీడీ నివేదించింది.

    దాడి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.

    దాడి విషయంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు, రైలు విశాఖపట్నం చేరుకున్న తర్వాత అసలు పరిస్థితిని అంచనా వేస్తామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓరాకేశ్‌ పేర్కొన్నారు.

    కొంతమంది పిల్లలు రైలుపై రాళ్లు రువ్వి ఉండవచ్చని ప్రాథమిక విచారణ ఆధారంగా ఒక అధికారి తెలిపారు.

    వందే భారత్

    రాళ్ల దాడి జరగడం ఇదే తొలిసారి కాదు

    సికింద్రాబాద్‌-విశాఖపట్నం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరగడం ఇదే తొలిసారి కాదు. ఈ రైలు ప్రారంభానికి విశాఖపట్నంలోని రైల్వే యార్డు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రైలు కోచ్‌పై రాళ్లు రువ్వడంతో రెండు కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి.

    ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో హౌరా నుంచి న్యూ జల్‌పాయిగుఢి మధ్య ప్రారంభమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై కూడా రాళ్ల దాడి జరిగింది.

    తెలంగాణలోని సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మకర సంక్రాంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 15న వాస్తవంగా ప్రారంభించారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    తాజా

    Starlink price in India: బంగ్లాదేశ్‌లో ఉన్న ధరలకే ఇండియా డేటా ప్లాన్‌లను అందించనున్న స్టార్‌లింక్ స్టార్‌లింక్‌
    Kerala: కేరళ తీరంలో సింగపూర్ జెండాతో కూడిన ఓడలో పేలుడు.. స్పందించిన నేవీ  కేరళ
    AP Government: ఉపాధి హామీ పథకం పనుల కోసం రూ.176.35 కోట్ల విడుదల.. ఆంధ్రప్రదేశ్
    Indian Army: డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌  ఆర్మీ

    తెలంగాణ

    గోషామహల్ బస్తీలో కుంగిన పెద్ద నాలా.. దుకాణాలు, వాహనాలు అందులోకే.. భారతదేశం
    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? చంద్రబాబు నాయుడు
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే కేసీఆర్‌ను జాతీయ స్థాయిలో నిలబెడతాయా? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్.. సంక్షేమ హాస్టళ్లలో 581 ఖాళీల భర్తీ భారతదేశం

    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025