NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి
    తదుపరి వార్తా కథనం
    'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి
    వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి

    'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి

    వ్రాసిన వారు Stalin
    Jan 03, 2023
    06:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమ బెంగాల్‌లో హౌరా నుంచి న్యూ జల్‌పాయిగుఢి మధ్య ఇటీవల ప్రారంభమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి జరిగింది. మాల్దా జిల్లాలోని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మాల్దా పట్టణానికి 50కిలోమీటర్ల దూరంలో దాడి జరిగనట్లు అధికారులు చెప్పారు.

    దుండగుల దాడి కారణంగా సీ13 కోచ్‌లో అద్దాలు ధ్వంసమైనట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. రైలుపై దాడి జరిగినా.. ఆ ట్రైన్ ఎక్కడా ఆగలేదని, నేరు తర్వాతి స్టేషన్ అయిన మాల్దాలోనే ఆగినట్లు వివరించారు. రైల్వే పోలీసులు ఈ దాడిని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

    వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలు

    'ఎన్ఐఏతో విచారణ జరిపించాలి'

    వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. హౌరా రైల్వే స్టేషన్ వద్ద జై శ్రీరామ్ అని నినదించడం వల్లే ఈ దాడి చేసినట్లు బీజేపీ సీనియర్ నేత సువెందు అధికారి చెప్పాపారు. జై శ్రీరామ్ నినాదాలు చేయడమై నేరమా? అంటూ ప్రశ్నించారు.

    రైలు దాడిని అంత తేలికగా తీసుకోవద్దని, తీవ్రంగా పరిగణించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఎన్ఐఏతో విచారణ జరిపించి.. నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు.

    కన్నతల్లి మరణించిన బాధను దిగమింగుకొని ప్రధాని మోదీ.. డిసెంబర్ 30న వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దీంతో బీజేపీ శ్రేణులు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పశ్చిమ బెంగాల్
    భారతదేశం

    తాజా

    Nambala Kesava Rao: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు మృతి  ఛత్తీస్‌గఢ్
    Virat Anushka: పికిల్‌బాల్ కోర్టులో విరాట్, అనుష్క జంట  విరాట్ కోహ్లీ
    Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 410 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు  స్టాక్ మార్కెట్
    MI vs DC: ఒకే స్థానం.. రెండు జట్లు.. వాంఖడేలో సమరం షూరు! ముంబయి ఇండియన్స్

    పశ్చిమ బెంగాల్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    భారతదేశం

    రామానుజన్ నంబర్ 1729 కి ఉన్న విశేషం తెలుసుకోవాల్సిందే సినిమా
    మంచి ఉద్యోగం వదులుకోని.. సన్యాసిగా మారుతున్న యువ శాస్త్రవేత్త భారతదేశం
    PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు వ్యాపారం
    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ రాజస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025