NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి
    భారతదేశం

    'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి

    'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 03, 2023, 06:04 pm 1 నిమి చదవండి
    'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి
    వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి

    పశ్చిమ బెంగాల్‌లో హౌరా నుంచి న్యూ జల్‌పాయిగుఢి మధ్య ఇటీవల ప్రారంభమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి జరిగింది. మాల్దా జిల్లాలోని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మాల్దా పట్టణానికి 50కిలోమీటర్ల దూరంలో దాడి జరిగనట్లు అధికారులు చెప్పారు. దుండగుల దాడి కారణంగా సీ13 కోచ్‌లో అద్దాలు ధ్వంసమైనట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. రైలుపై దాడి జరిగినా.. ఆ ట్రైన్ ఎక్కడా ఆగలేదని, నేరు తర్వాతి స్టేషన్ అయిన మాల్దాలోనే ఆగినట్లు వివరించారు. రైల్వే పోలీసులు ఈ దాడిని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

    'ఎన్ఐఏతో విచారణ జరిపించాలి'

    వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. హౌరా రైల్వే స్టేషన్ వద్ద జై శ్రీరామ్ అని నినదించడం వల్లే ఈ దాడి చేసినట్లు బీజేపీ సీనియర్ నేత సువెందు అధికారి చెప్పాపారు. జై శ్రీరామ్ నినాదాలు చేయడమై నేరమా? అంటూ ప్రశ్నించారు. రైలు దాడిని అంత తేలికగా తీసుకోవద్దని, తీవ్రంగా పరిగణించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఎన్ఐఏతో విచారణ జరిపించి.. నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు. కన్నతల్లి మరణించిన బాధను దిగమింగుకొని ప్రధాని మోదీ.. డిసెంబర్ 30న వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దీంతో బీజేపీ శ్రేణులు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    భారతదేశం
    పశ్చిమ బెంగాల్

    తాజా

    మార్చి 24న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం; టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం ఎమ్మెల్సీ
    మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది ఆటో మొబైల్
    ఉబర్ యాప్ లో తప్పులు కనిపెట్టి 4.6లక్షలు రివార్డు అందుకున్న ఆనంద్ ప్రకాష్ జీవనశైలి

    భారతదేశం

    భారత్ 6G విజన్: భారతదేశంలో త్వరలోనే 6G రానుంది టెక్నాలజీ
    గుజరాత్‌లోని సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపు వైరల్ అవుతున్న వీడియో గుజరాత్
    ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష నామినీ అజయ్ బంగా ప్రపంచం
    2050కల్లా ఇండియాలో నీటి సమస్యలు: హెచ్చరించిన యునైటెడ్ నేషన్స్ భారతదేశం

    పశ్చిమ బెంగాల్

    2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ మమతా బెనర్జీ
    'తృణమూల్ కాంగ్రెస్' ట్విట్టర్ ఖాతా హ్యాక్; పేరు, లోగో మార్పు ట్విట్టర్
    Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్ అసెంబ్లీ ఎన్నికలు
    పశ్చిమ బెంగాల్‌లోని 15 కొత్త నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G ఎయిర్ టెల్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023