NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా?
    తదుపరి వార్తా కథనం
    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా?
    సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా?

    వ్రాసిన వారు Stalin
    Jan 06, 2023
    10:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ త్వరలోనే పట్టాలెక్కనుంది. కాజీపేట మీదుగా సికింద్రాబాద్-విజయవాడ మధ్య ప్రయాణించే ఈ రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రధాని షెడ్యూల్‌ను బట్టి జనవరిలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌‌ ప్రారంభోత్సవాన్ని నిర్వహించే అవకాశం ఉందని పీఎంఓ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

    తెలంగాణలో ఇది ఎన్నికల ఏడాది కావడంతో.. ప్రధానమంత్రి పలుమార్లు ఇక్కడికి వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలో తొలిసారి వచ్చినప్పుడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ మరికొన్ని రైల్వే ప్రాజెక్టులను ఆయన ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

    మోదీ

    ఆ మూడు రైల్వే ప్రాజెక్టుల ప్రారంభం కూడా అప్పుడే!

    కాజీపేటలో ప్రతిపాదిత పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వ్యాగన్ వర్క్‌షాప్ కోసం రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఇటీవలే టెండర్‌ను ఖరారు చేసింది. ఆ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి సిద్ధమైంది.

    సికింద్రాబాద్‌ రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తయి.. పనులు ప్రాంరంభించడానికి సిద్ధంగా ఉంది.

    సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ మధ్య ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రెండో రైల్వే లైన్‌ నిర్మాణ పనులు కూడా పెండింగ్ లో ఉన్నాయి.

    వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఆవిష్కరణలోనే.. ఈ మూడు రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించే అవకాశం ఉంది. దీని వల్ల అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు ఉంటుంది.. ఎన్నికల ప్రచారంలో అస్త్రంగా ఉపయోగపడుతుందని ఆలోచనలో మోదీ ఉన్నట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    నరేంద్ర మోదీ

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి' ఉక్రెయిన్
    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ గుజరాత్
    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా? చంద్రబాబు నాయుడు
    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ గుజరాత్

    ప్రధాన మంత్రి

    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్ నరేంద్ర మోదీ
    వాటర్ విజన్ @ 2047: నీటి నిర్వహణపై పంచాయతీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025