
Rajnath Singh: బ్రహ్మోస్ పరిధిలోనే పాక్ మొత్తం ఉంది.. హెచ్చరించిన రాజ్నాథ్ సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కు కఠిన హెచ్చరిక ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక ట్రైలర్ మాత్రమే అని స్పష్టం చేశారు. ఈఆపరేషన్ ద్వారా భారతదేశానికి సాధించిన విజయం ఇప్పుడు ఒక అలవాటుగా మారిందని ఆయన తెలిపారు. అదేవేళ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి రాజ్నాథ్ సింగ్ లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో తయారైన బ్రహ్మోస్ క్షిపణుల మొదటి బ్యాచ్ను జెండా ఊపి ప్రారంభించారు. రక్షణశక్తికి బ్రహ్మోస్ ఒక ప్రతీకం అని రాజ్నాథ్ సింగ్ వివరించారు. 'బ్రహ్మోస్ కేవలం క్షిపణి కాదు, ఇది భారతదేశం వ్యూహాత్మక విశ్వాసానికి రుజువు. సైన్యం, నావికాదళం, వైమానిక దళం వరకు, ఇది మన రక్షణ దళాలకు కీలక స్తంభంగా మారిందని ఆయన పేర్కొన్నారు.
Details
ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ మాత్రమే
పాకిస్తాన్ భూభాగంలోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలో ఉంది. 'ఆపరేషన్ సిందూర్ సమయంలో ఏమి జరిగిందో అది కేవలం ట్రైలర్ మాత్రమే. భారతదేశం సమయం వచ్చినప్పుడు పాకిస్తాన్పై చర్య తీసుకోవడానికి సిద్దంగా ఉందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. అంతేకాదు, ఆపరేషన్ సిందూర్ భారతీయులకు కొత్త విశ్వాసం ఇచ్చిందని, ప్రపంచానికి బ్రహ్మోస్ ప్రభావాన్ని చూపించిందని చెప్పారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 'బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు' ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ వైమానిక స్థావరాలను ఖచ్చితంగా నాశనం చేయడంలో ఉపయోగించారని వెల్లడించారు. పాక్ రాడార్లకు దొరకకుండా అత్యంత ఖచ్చితత్వంతో ఈ క్షిపణులు లక్ష్యాలను చేరుకున్నాయని ఆయన వివరించారు.