NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సద్గురుకు కర్ణాటక హైకోర్టు షాక్, ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవం నిలిపివేత
    తదుపరి వార్తా కథనం
    సద్గురుకు కర్ణాటక హైకోర్టు షాక్, ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవం నిలిపివేత
    ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవాన్ని నిలిపివేసిన కర్ణాటక హైకోర్టు

    సద్గురుకు కర్ణాటక హైకోర్టు షాక్, ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవం నిలిపివేత

    వ్రాసిన వారు Stalin
    Jan 12, 2023
    04:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్‌కు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. బెంగళూరు సమీపంలోని నంది కొండల దిగువన ఆదియోగి విగ్రహావిష్కరణతో పాటు ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవంపై స్టే విధించింది.

    పర్యావరణానికి హాని కలిగించేలా.. అక్రమంగా ఈశా యోగా కేంద్రానికి ప్రభుత్వం భూమిని కేటాయించిందని ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పీఐఎల్) హైకోర్టులో దాఖలైంది. పిల్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వం, యోగా కేంద్రంతోపాటు 14 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

    జనవరి 15న ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదియోగి విగ్రహావిష్కరణతో పాటు యోగా కేంద్రాన్ని ప్రారంభించాల్సి ఉండగా.. హైకోర్టు స్టే విధించడంతో కార్యక్రమం నిలిచిపోయింది.

    సద్గురు జగ్గీవాసుదేవ్‌

    నంది హిల్స్ ప్రాంతంలోని ప్రజల జీవనోపాధిపై ప్రభావం: పీఐఎల్

    చిక్కబళ్లాపురానికి చెందిన క్యాతప్పతో పాటు పలువురు గ్రామస్థులు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిల్‌లో కీలక విషయాలను కోర్టుకు విన్నవించారు.

    చట్టాలను ఉల్లంఘిస్తూ.. శతాబ్దాల చరిత్ర ఉన్న నంది హిల్స్, నరసింహ దేవరు రేంజ్ (బెట్ట) దిగువ ప్రాంతంలోని పర్యావరణ వ్యవస్థ, సహజ నీటి వనరులను నాశనం చేయడానికి అధికారులు అనుమతులు ఇచ్చిన ఆ పిల్‌లో ఆరోపించారు. నంది హిల్స్ ప్రాంతంలోని ప్రజల జీవనోపాధి, పశువులు, వన్యప్రాణులపై తాజా నిర్మాణాల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.

    ఉత్తర పినాకిని, దక్షిణ పినాకిని నదులు నంది హిల్స్‌లో ఉద్భవించాయని, తాజా జరుగుతున్నకట్టడాల వల్లఅవి ప్రభావితమవుతాయని ఫిర్యాదుదారులు వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    హైకోర్టు

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    కర్ణాటక

    కరోనా BF.7 వేరియంట్ సోకిన వారికి అక్కడ ఉచితంగా చికిత్స కోవిడ్
    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    కాలేజీలో దారుణం.. విద్యార్థినిపై కత్తితో పొడిచి హత్య.. భారతదేశం
    మెట్రో పిల్లర్ కూలి తల్లి, మూడేళ్ల కుమారుడు దుర్మరణం భారతదేశం

    హైకోర్టు

    అసైన్డ్ భూముల్లో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టులో విచారణ.. మంత్రి రజనీకి నోటీసు ఆంధ్రప్రదేశ్
    సలహాదారుల నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురు.. క్యాడర్ కేటాయింపు రద్దు తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025