NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సద్గురుకు కర్ణాటక హైకోర్టు షాక్, ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవం నిలిపివేత
    భారతదేశం

    సద్గురుకు కర్ణాటక హైకోర్టు షాక్, ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవం నిలిపివేత

    సద్గురుకు కర్ణాటక హైకోర్టు షాక్, ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవం నిలిపివేత
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 12, 2023, 04:53 pm 0 నిమి చదవండి
    సద్గురుకు కర్ణాటక హైకోర్టు షాక్, ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవం నిలిపివేత
    ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవాన్ని నిలిపివేసిన కర్ణాటక హైకోర్టు

    ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్‌కు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. బెంగళూరు సమీపంలోని నంది కొండల దిగువన ఆదియోగి విగ్రహావిష్కరణతో పాటు ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవంపై స్టే విధించింది. పర్యావరణానికి హాని కలిగించేలా.. అక్రమంగా ఈశా యోగా కేంద్రానికి ప్రభుత్వం భూమిని కేటాయించిందని ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పీఐఎల్) హైకోర్టులో దాఖలైంది. పిల్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వం, యోగా కేంద్రంతోపాటు 14 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జనవరి 15న ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదియోగి విగ్రహావిష్కరణతో పాటు యోగా కేంద్రాన్ని ప్రారంభించాల్సి ఉండగా.. హైకోర్టు స్టే విధించడంతో కార్యక్రమం నిలిచిపోయింది.

    నంది హిల్స్ ప్రాంతంలోని ప్రజల జీవనోపాధిపై ప్రభావం: పీఐఎల్

    చిక్కబళ్లాపురానికి చెందిన క్యాతప్పతో పాటు పలువురు గ్రామస్థులు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిల్‌లో కీలక విషయాలను కోర్టుకు విన్నవించారు. చట్టాలను ఉల్లంఘిస్తూ.. శతాబ్దాల చరిత్ర ఉన్న నంది హిల్స్, నరసింహ దేవరు రేంజ్ (బెట్ట) దిగువ ప్రాంతంలోని పర్యావరణ వ్యవస్థ, సహజ నీటి వనరులను నాశనం చేయడానికి అధికారులు అనుమతులు ఇచ్చిన ఆ పిల్‌లో ఆరోపించారు. నంది హిల్స్ ప్రాంతంలోని ప్రజల జీవనోపాధి, పశువులు, వన్యప్రాణులపై తాజా నిర్మాణాల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఉత్తర పినాకిని, దక్షిణ పినాకిని నదులు నంది హిల్స్‌లో ఉద్భవించాయని, తాజా జరుగుతున్నకట్టడాల వల్లఅవి ప్రభావితమవుతాయని ఫిర్యాదుదారులు వివరించారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    కర్ణాటక
    హైకోర్టు

    తాజా

    ఏప్రిల్ 2న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    కైల్ మేయర్స్ సునామీ ఇన్నింగ్స్.. లక్నో భారీ స్కోరు డిల్లీ క్యాప్‌టల్స్
    డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విజయం ఐపీఎల్
    1.59 లక్షల పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం మహిళ

    కర్ణాటక

    Karnataka: 100శాతం నేనే కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని; డీకేతో ఇబ్బంది లేదు: సిద్ధరామయ్య కామెంట్స్ కాంగ్రెస్
    భారతదేశపు మొట్టమొదటి మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ బెంగళూరు
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ; మే 10న పోలింగ్, 13న కౌంటింగ్ ఎన్నికల సంఘం
    నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల అసెంబ్లీ ఎన్నికలు

    హైకోర్టు

    ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లపై గుజరాత్ హైకోర్టు కీలక ఆదేశాలు నరేంద్ర మోదీ
    ఓవర్‌టేక్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ర్యాష్ డ్రైవింగే అంటున్న ఢిల్లీ హైకోర్టు ఆటో మొబైల్
    ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ లోక్‌సభ
    విజయ్ మాల్యా పారిపోయే ముందు విదేశాల్లో రూ.330కోట్లతో ఆస్తులు కొన్నారు: సీబీఐ సీబీఐ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023