NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Heatwave: ఇప్పుడే ఉక్కపోత మొదలైంది.. రాబోయే రోజుల్లో మరింత తీవ్రత!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Heatwave: ఇప్పుడే ఉక్కపోత మొదలైంది.. రాబోయే రోజుల్లో మరింత తీవ్రత!
    ఇప్పుడే ఉక్కపోత మొదలైంది.. రాబోయే రోజుల్లో మరింత తీవ్రత!

    Heatwave: ఇప్పుడే ఉక్కపోత మొదలైంది.. రాబోయే రోజుల్లో మరింత తీవ్రత!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 01, 2025
    09:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సాధారణంగా వేసవి కాలం అంటే ఏప్రిల్, మే నెలలని భావిస్తారు. కానీ వాతావరణ మార్పుల ప్రభావంతో జనవరి, ఫిబ్రవరి నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

    ఈ పరిస్థితి వేసవి ముందుగానే వచ్చేసిందా అనే అనుమానాన్ని కలిగిస్తోంది. ఏటా ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు నమోదవుతుండగా, గత శతాబ్ద కాలంలో 2024 అత్యంత వేడి సంవత్సరంగా గుర్తింపు పొందింది.

    2025లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

    Details

    ఉష్ణోగ్రతల్లో భారీ పెరుగుదల

    2023లో ఆరు నెలలు, 2024లో ఏడాది పొడవునా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

    1901 నుంచి సేకరించిన వాతావరణ సమాచారం ప్రకారం, 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. సగటు ఉష్ణోగ్రత 0.65 డిగ్రీలు పెరిగింది.

    2023లో జనవరి నుంచి ఫిబ్రవరి మధ్య సాధారణం కంటే 0.37 డిగ్రీల పెరుగుదల నమోదు కాగా, ఈ ఏడాది జనవరిలో అది 0.94 డిగ్రీల వరకు పెరిగింది.

    గతంలో 1958లో 1.17 డిగ్రీలు, 1990లో 0.97 డిగ్రీలు పెరిగిన తరువాత, 2024లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా పెరగడం గమనార్హం.

    Details

     'లానినా' ప్రభావం తగ్గడం 

    వాతావరణ మార్పుల ప్రభావం లానినా పరిస్థితులపై స్పష్టంగా కనిపిస్తోంది. లానినా బలహీనపడటంతో శీతాకాలంలో చలి తీవ్రత అంతగా అనుభూతి కాలేదు.

    వాతావరణ నిపుణుల ప్రకారం రాబోయే వారాల్లో తూర్పు, మధ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి పెరిగే సూచనలున్నాయి.

    ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో 5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

    దక్షిణ భారతదేశంతో పాటు వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను మినహాయించి మిగిలిన చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని అంచనా వేస్తున్నారు.

    ఇప్పటికే కేరళలో జనవరి నుంచే సాధారణాన్ని మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

    Details

    ఆదోనిలో 35.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత 

    భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం, రాష్ట్రంలో రాబోయే రోజుల్లో గరిష్ట, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. రెండు రోజులుగా ఉక్కపోత పెరుగుతూ వస్తోంది.

    కర్నూలు జిల్లా ఆదోనిలో శుక్రవారం 35.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు, అన్నమయ్య, వైఎస్సార్, ప్రకాశం, నంద్యాల, అనకాపల్లి, శ్రీసత్యసాయి, కర్నూలు, అనంతపురం, తిరుపతి, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

    శుక్రవారం తుని, నందిగామ, గన్నవరం, నంద్యాల, కడప వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగాయి.

    కోస్తాంధ్రతో పోలిస్తే రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో అధిక ఉక్కపోత ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ మాజీ డైరెక్టర్ కేజే రమేశ్ అభిప్రాయపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ
    ఆదోని
    కేరళ

    తాజా

    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్
    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్
    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా

    ఆంధ్రప్రదేశ్

    AP Cabinet: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం భారతదేశం
    Polavaram Project: పోలవరం డయాఫ్రం వాల్.. కొత్త నిర్మాణ పనులు ప్రారంభం పోలవరం
    Rajamahendravaram: 64 ఏళ్ల మూర్తి, 68 ఏళ్ల రాములమ్మ పెళ్లి.. వృద్ధాశ్రమంలో అరుదైన ప్రేమకథ రాజమహేంద్రవరం
    Andhra Pradesh: ఏపీలో వ్యవసాయానికి 50 శాతం విద్యుత్ అందించే మొట్టమొదటి ప్రాజెక్టు భారతదేశం

    తెలంగాణ

    Padi kaushik Reddy: కరీంనగర్ కలెక్టరేట్‌లో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై మూడు కేసులు కరీంనగర్
    Cultivation of vegetables: సర్కారు బడిలో కూరగాయల సాగు.. భోజనంతో పాటు విద్యా వికాసం పెద్దపల్లి
    Telangana: రాష్ట్రంలో స్తంభించపోయిన చెక్‌డ్యాంల నిర్మాణం భారతదేశం
    E-buses: తెలంగాణలో కాలుష్యం తగ్గించేందుకు నూతన ప్రణాళిక.. మర్చి 31 నాటికి 314 ఈ-బస్సులు హైదరాబాద్

    ఆదోని

    BJP leader killed: కర్నూలు జిల్లాలో బీజేపీ నేతను గొంతు కోసిన చంపిన దుండగులు కర్నూలు

    కేరళ

    Wayanad tragedy: వయనాడ్ విషాదానికి గోహత్యలే కారణం.. బీజేపీ నేత సంచలన ఆరోపణ  కొండచరియలు
    కేరళ విషాదం.. రూ. కోటీ విరాళం అందించిన చిరంజీవి, రామ్ చరణ్ చిరంజీవి
    Kerala:మెదడు తిన్న అమీబా కారణంగా 6 నెలల్లో 5 మరణాలు.. తిరువనంతపురంలో అత్యధిక కేసులు   భారతదేశం
    Wayanad Landslide: వాయనాడ్ విపత్తు కోసం నిధులు సేకరించిన 13 ఏళ్ల బాలిక .. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025