NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pahalgam Terror Attack: హనీమూన్‌లో విషాదం.. కళ్లముందే భర్తను కోల్పోయిన నవ వధువు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pahalgam Terror Attack: హనీమూన్‌లో విషాదం.. కళ్లముందే భర్తను కోల్పోయిన నవ వధువు
    హనీమూన్‌లో విషాదం.. కళ్లముందే భర్తను కోల్పోయిన నవ వధువు

    Pahalgam Terror Attack: హనీమూన్‌లో విషాదం.. కళ్లముందే భర్తను కోల్పోయిన నవ వధువు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 23, 2025
    09:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నిండునూరేళ్లు కలిసి బతకాలని పెళ్లి కలలు కన్న వారు కలలు క్షణాల్లోనే అవిరయ్యాయి.

    హనీమూన్‌కు వెళ్లిన నూతన దంపతుల జీవితాల్లో ఉగ్రవాదులు విషాన్ని చిమ్మేశారు.

    పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు కొత్తగా పెళ్లైనవారే. వారిలో ఒకరు నౌకాదళ అధికారి కావడం హృదయ విదారకంగా మారింది.

    కళ్లముందే తన భర్తను కాల్చిచంపిన దృశ్యాన్ని చూసిన నవ వధువు రోదన అందరి హృదయాలను కదిలించింది.

    Details

    పెళ్లైన ఆరు రోజుల్లోనే విషాదం 

    హరియాణాకు చెందిన 26 ఏళ్ల లెఫ్టినెంట్‌ వినయ్‌ నర్వాల్‌ రెండు సంవత్సరాల క్రితమే నౌకాదళంలో చేరారు.

    కేరళలోని కోచిలో విధులు నిర్వహిస్తున్న ఆయన ఏప్రిల్‌ 16న వివాహమాడగా, 19న అతిథుల కోసం విందు ఏర్పాటు చేశారు. అనంతరం భార్యతో కలిసి హనీమూన్‌ టూర్‌లో భాగంగా కశ్మీర్‌ వెళ్లారు.

    మంగళవారం పహల్గాంలో చోటుచేసుకున్న ఉగ్రదాడిలో వినయ్‌ ప్రాణాలు కోల్పోయారు.

    ఆయన మృతదేహం పక్కన కూర్చొని విలపిస్తున్న భార్య దృశ్యం అందరినీ కన్నీటి పర్యంతం చేసింది.

    Details

    భర్తను కళ్లెదుటే తలపై కాల్చి 

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన శుభమ్ ద్వివేది ఫిబ్రవరి 12న వివాహం చేసుకున్నారు.

    ఉద్యోగరీత్యా బిజీగా ఉన్న ఆయన ఇటీవలే తన భార్యను కశ్మీర్ వెకేషన్‌కు తీసుకెళ్లారు.

    అక్కడే మంగళవారం జరిగిన కాల్పుల్లో ఆయన మృతి చెందారు.

    శుభమ్‌ భార్య తెలిపిన వివరాల ప్రకారం, దాడికి ముందు ముష్కరులు వారి పేర్లు ఒక్కొక్కరిగా అడిగి, అనంతరం తలపై కాల్చి చంపారని చెప్పారు.

    Details

    మిగతా బాధితులు వీరే 

    ఈ దాడిలో ఒడిశాకు చెందిన అకౌంట్స్ అధికారి ప్రశాంత్ సత్పతీ, గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన శైలేష్ కడతియా కూడా ప్రాణాలు కోల్పోయారు.

    వీరిద్దరూ కూడా తమ భార్య, పిల్లలతో కలిసి కశ్మీర్‌కు వెకేషన్‌ కోసం వెళ్లినవారే. ప్రశాంత్‌ కుటుంబ సభ్యుల ప్రకారం, ఆయన భార్య, కుమారుడి వివరాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు.

    శైలేష్‌కు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారని సమాచారం. ఈ ఉగ్రవాద దాడి నిర్ఘాంతవాన్ని కలిగించగా, బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్
    ఇండియా

    తాజా

    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా
    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం

    జమ్ముకశ్మీర్

    Tashi Namgyal: కార్గిల్ యుద్ధంలో పాక్ కుట్రను భగ్నం చేసిన ఆ గొర్రెల వ్యాపారి ఇక లేరు ఇండియా
    West Bengal: కశ్మీరీ ఉగ్రవాది జావేద్ మున్షీ అరెస్ట్.. సంచలన నిజాలు వెలుగులోకి! పశ్చిమ బెంగాల్
    Jammu and Kashmir: జీతం కోసం ఎదురుచూస్తున్న జమ్మూకశ్మీర్‌ ఎమ్మెల్యేలు  భారతదేశం
    Jammu Kashmir: లోయలో పడిన వాహనం.. ఐదుగురు సైనికుల మృతి భారతదేశం

    ఇండియా

    Indian fisherman: పాకిస్థాన్ జైల్లో మగ్గుతూ భారత మత్స్యకారుడు ఆత్మహత్య పాకిస్థాన్
    TGPSC: తెలంగాణ గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ విడుదల.. మహిళా అభ్యర్థి టాప్ తెలంగాణ
    Swati Sachdeva: స్టాండప్‌ షోలలో హద్దులు దాటుతున్న కామెడీ.. స్వాతి సచ్‌దేవా వివాదాస్పద వ్యాఖ్యలు  భారతదేశం
    Chirag Paswan: అనవసరపు చర్చ వద్దు.. వీధుల్లో నమాజ్ పై కేంద్రమంత్రి స్పందన కేంద్రమంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025