NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'శివసేన' పార్టీ గుర్తుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రే- రేపు విచారణ
    'శివసేన' పార్టీ గుర్తుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రే- రేపు విచారణ
    భారతదేశం

    'శివసేన' పార్టీ గుర్తుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రే- రేపు విచారణ

    వ్రాసిన వారు Naveen Stalin
    February 20, 2023 | 12:29 pm 1 నిమి చదవండి
    'శివసేన' పార్టీ గుర్తుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రే- రేపు విచారణ
    'శివసేన' పార్టీ గుర్తుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రే

    'శివసేన' పార్టీ పేరు, 'విల్లు, బాణం' గుర్తును మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి ఎన్నికల సంఘం కేటాయించడంపై ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, ఉద్ధవ్ ఠాక్రే సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ఉద్ధవ్ ఠాక్రే తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. మంగళవారం దీనిపై విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారంపై షిండే వర్గం ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

    ఎన్నికల సంఘం బీజేపీ ఏజెంట్‌గా పని చేస్తోంది: ఠాక్రే

    మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే గత సంవత్సరం ఠాక్రేపై తిరుగుబాటు చేసినప్పటి నుంచి ఇరు వర్గాలు పార్టీ పేరు, చిహ్నం కోసం పోరాడుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి శివసేన పేరును, 'విల్లు, బాణం'ను కేటాయించింది. భారత ఎన్నికల సంఘం నిర్ణయాన్ని షిండే వర్గం స్వాగతించగా, ఉద్ధవ్ ఠాక్రే వర్గం మాత్రం తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది. ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎన్నికల సంఘం తొందరపాటుతో వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఎన్నికల సంఘం బీజేపీ ఏజెంట్‌గా పని చేస్తుందని మండిపడింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    శివసేన
    సుప్రీంకోర్టు
    ఉద్ధవ్ థాకరే
    ఏకనాథ్ షిండే

    శివసేన

    కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశం
    శివసేన కేసు: ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    మహారాష్ట్ర: సంజయ్ రౌత్‌పై పరువు నష్టం కేసు; హత్యాయత్నం ఆరోపణలపై రాజకీయ దుమారం మహారాష్ట్ర
    'ఏకే 47తో చంపేస్తాం'; సంజయ్ రౌత్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు మహారాష్ట్ర

    సుప్రీంకోర్టు

    అదానీ గ్రూప్ వ్యవహారంపై కేంద్రానికి గట్టి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు అదానీ గ్రూప్
    యూపీ: అక్రమ ఆయుధాల నివారణకు తీసుకుంటున్న చర్యలేంటి? రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఉత్తర్‌ప్రదేశ్
    జమ్ముకశ్మీర్ డీలిమిటేషన్‌పై దాఖలైన పిటిషన్ కొట్టివేత-సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట జమ్ముకశ్మీర్
    బీబీసీ బ్యాన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీరియస్ బీబీసీ

    ఉద్ధవ్ థాకరే

    ఉద్ధవ్ ఠాక్రే‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు; గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ధర్మాసనం సుప్రీంకోర్టు
    ఉద్ధవ్ థాకరే వర్గం సన్నిహితులపై లాండరింగ్ అభియోగాలు.. ఈడీ సోదాలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    పాట్నలో సమావేశమైన ప్రతిపక్ష కూటమిని 'వాగ్నర్ గ్రూప్' గా పోల్చిన ఉద్ధవ్ ఠాక్రే శివసేన
    మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం: అజిత్ పవార్‌ను కలిసిన ఉద్ధవ్ ఠాక్రే  మహారాష్ట్ర

    ఏకనాథ్ షిండే

    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి మహారాష్ట్ర
    అజిత్ పవార్ మళ్లీ ఎన్‌సీపీకి హ్యాండ్ ఇవ్వనున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    ఈదురు గాలులకు కూలిన భారీ చెట్టు; ఏడుగురు మృతి మహారాష్ట్ర
    మహారాష్ట్ర భూషణ్ అవార్డు వేడుకలో విషాదం; వడదెబ్బకు 11మంది మృతి; 120మందికి అస్వస్థత  మహారాష్ట్ర
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023