Loading...
UPI Charges: విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గలేదు.. యూపీఐ విధానాలపై కేంద్రం స్పష్టత
విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గలేదు.. యూపీఐ విధానాలపై కేంద్రం స్పష్టత

UPI Charges: విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గలేదు.. యూపీఐ విధానాలపై కేంద్రం స్పష్టత

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2026
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూపీఐ ఛార్జీల మార్పుల వెనుక విదేశీ శక్తుల ప్రభావం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖండించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)కు సంబంధించిన అన్ని విధాన నిర్ణయాలు దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, స్వతంత్రంగా తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియా వేదిక 'ఎక్స్‌'లో ప్రకటన విడుదల చేసింది. విదేశీ ప్రభావం ఉందన్న వాదనలు అవాస్తవమని ఆర్థిక శాఖ పేర్కొంది. 2016లో ప్రారంభమైనప్పటి నుంచి యూపీఐ భారతీయ నిబంధనలకు అనుగుణంగానే అభివృద్ధి చెందిందని తెలిపింది. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌టైమ్ చెల్లింపుల వ్యవస్థగా ఎదిగిందని గుర్తుచేసింది. 2026 ఆగస్టు నెలలోనే యూపీఐ ద్వారా 24.5 బిలియన్ల లావాదేవీలు జరిగినట్లు వెల్లడించింది.

వివరాలు 

అధిక విలువైన లావాదేవీలకే స్వల్ప రుసుము

యూపీఐ వ్యవస్థను స్వయం సమృద్ధిగా, సురక్షితంగా, నిరంతరం అభివృద్ధి చెందేలా నిర్వహించేందుకు అధిక విలువ కలిగిన వ్యాపార లావాదేవీలపై స్వల్ప రుసుము విధించినట్లు కేంద్రం వివరించింది.

ఈ రుసుముల ద్వారా సమకూరే నిధులను యూపీఐ మౌలిక వసతుల అభివృద్ధి, సైబర్‌ సెక్యూరిటీ బలోపేతం, గ్రామీణ ప్రాంతాలు, టైర్‌ III నుంచి టైర్‌ VI పట్టణాల్లోని చిన్న వ్యాపారులకు మద్దతు, డిజిటల్‌ చెల్లింపులపై అవగాహన పెంపు వంటి కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు పేర్కొంది.

వివరాలు 

వినియోగదారులకు సేవలు ఉచితమే

యూపీఐ వినియోగదారులకు గతంలో మాదిరిగానే అన్ని సేవలు ఉచితంగా కొనసాగుతాయని కేంద్రం పునరుద్ఘాటించింది.

స్నేహితులకు డబ్బు పంపడం, దుకాణాల్లో చెల్లింపులు చేయడం, క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం వంటి వ్యక్తిగత లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది.

నెలకు రూ.1 లక్ష వరకు యూపీఐ ద్వారా ఆదాయం పొందే వ్యాపారులకు కూడా ఛార్జీల మినహాయింపు కొనసాగుతుందని తెలిపింది.

దేశంలో జరిగే 95 శాతానికి పైగా వ్యాపార చెల్లింపులు రూ.2,000లోపే ఉంటాయని, ఈ లావాదేవీలపై ఎలాంటి రుసుము విధించబోమని కేంద్రం పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు 

రూ.2,000 దాటిన వ్యాపార లావాదేవీలపై 0.4% రుసుము

రూ.2,000కు మించిన అధిక విలువ కలిగిన వ్యాపార లావాదేవీలపై మాత్రమే 0.4 శాతం స్వల్ప రుసుము వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.

ఈ రుసుమును వ్యాపారులే చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

క్రెడిట్‌ కార్డు ఛార్జీలతో పోలిస్తే ఈ రుసుము చాలా తక్కువగా ఉంటుందని వివరించింది.

రైల్వే, ఇంధనం, టెలికాం, బీమా, బిల్లు చెల్లింపులు వంటి విభాగాల్లో రూ.2,000కు మించిన లావాదేవీలపై రూ.5 ఫ్లాట్‌ ఫీజు ఉంటుందని పేర్కొంది.

మ్యూచువల్‌ ఫండ్‌, సెక్యూరిటీస్‌ చెల్లింపులపై 0.02 శాతం రుసుము విధించనున్నట్లు తెలిపింది. దీనికి గరిష్ఠ పరిమితిని రూ.300గా నిర్ణయించినట్లు వెల్లడించింది.

ADVERTISEMENT

వివరాలు 

వినియోగదారులపై ఛార్జీల భారం వేయొద్దు

వ్యాపారులు ఈ రుసుములను వినియోగదారుల నుంచి వసూలు చేయడానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది.

అంతేకాకుండా, యూపీఐ యాప్‌లు కూడా అదనపు ప్లాట్‌ఫామ్‌ ఛార్జీలు విధించకూడదని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు పేర్కొంది.

ADVERTISEMENT