Manipur violence: మణిపూర్లో మరోసారి విధ్వంసం, భద్రతా దళాల బస్సులకు నిప్పు
మణిపూర్లో మరోసారి విధ్వంసం చెలరేగింది. మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని మోరే జిల్లాలో ఒక గుంపు అనేక ఇళ్లకు నిప్పు పెట్టింది. కాంగ్కోపి జిల్లాలో భద్రతా సిబ్బందిని రవాణా చేసేందుకు ఉపయోగించే రెండు బస్సులను కూడా ఆందోళనకారులు తగలబెట్టారు. దిమాపూర్ నుంచి బస్సులు వస్తుండగా సపోర్మీనా వద్ద ఈ ఘటన జరిగింది. సపోర్మీనా వద్ద స్థానికులు మణిపూర్ రిజిస్ట్రేషన్ నంబర్లతో కూడిన బస్సులను నిలిపివేసి హల్ చల్ చేశారు. ఆ బస్సుల్లో ప్రత్యర్థి కమ్యూనిటీకి చెందిన వారు ఉన్నారో? లేదో? తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే కొందరు బస్సులకు నిప్పు పెట్టారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.