English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / స్వామీజీ పూర్ణానంద అర్ధరాత్రి అరెస్ట్.. రెండేళ్లుగా బాలికపై అత్యాచారం
    తదుపరి వార్తా కథనం
    స్వామీజీ పూర్ణానంద అర్ధరాత్రి అరెస్ట్.. రెండేళ్లుగా బాలికపై అత్యాచారం
    పూర్ణానంద స్వామీ అత్యాచారం ఆరోపణలపై అరెస్ట్

    స్వామీజీ పూర్ణానంద అర్ధరాత్రి అరెస్ట్.. రెండేళ్లుగా బాలికపై అత్యాచారం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 20, 2023
    10:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విశాఖపట్టణంలోని జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీ అత్యాచారం ఆరోపణలపై అరెస్టయ్యారు. తనపై రెండేళ్ల నుంచి స్వామీజీ అత్యాచారానికి పాల్పడుతున్నారని రాజమహేంద్రవరానికి చెందిన 15 ఏళ్ల అనాథ బాలిక ఫిర్యాదు చేసింది.

    దీంతో అర్ధరాత్రి స్వామీజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్న వయసులోనే అమ్మానాన్నలను కోల్పోయిన బాధిత బాలికను బంధువులు చేరదీశారు. ఈ క్రమంలో ఆమెను ఐదో తరగతి వరకు చదివించి చేతులు దలుపుకున్నారు.

    ఈ నేపథ్యంలోనే బాలికను విశాఖలోని కొత్త వెంకోజీపాలెంలో ఉన్న జ్ఞానానంద ఆశ్రమంలో బంధువులు రెండేళ్ల క్రితం చేర్పించారు. అక్కడ ఆమెకు ఆవులకు మేత వేయించడం, పేడ తీయించడం వంటి పనులను అప్పచెప్పేవారని బాలిక పిర్యాదులో వెల్లడించింది.

    DETAILS

    రైళ్లో తోటి ప్రయాణికురాలి సహాయంతోనే ఫిర్యాదు

    ఇక రాత్రి కాగానే స్వామిజీ తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేవారని లేఖలో పేర్కొంది. గత ఏడాది కాలంగా స్వామిజీ తన గదిలోనే గొలుసులతో బంధించేవారని, ఎదురు తిరిగితే కొట్టేవారన్నారు.

    తనకు కేవలం రెండు చెంచాల అన్నం మాత్రమే పెట్టేవారని, కాల కృత్యాలకు సైతం సరిగ్గా పంపించేవారు కాదన్నారు.

    వారంలో ఒక్కరోజు మాత్రమే స్నానానికి అనుమతిచ్చేవారని బాలిక ఫిర్యాదులో స్పష్టం చేశారు. అయితే ఈ నెల 13న పనిమనిషి సాయంతో ఎలాగోలా ఆశ్రమం నుంచి తప్పించుకున్న బాలిక విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది.

    అక్కడ తిరుమల ఎక్స్‌ప్రెస్ ఎక్కేసింది. రైలులో తనకు పరిచయమైన తోటి ప్రయాణికురాలికి తన ఆవేదనను వివరించింది.

    మీరు
    33%
    శాతం పూర్తి చేశారు

    DETAILS

    తాను అనుభవించిన నరకాన్ని బాలల సంక్షేమ కమిటీకి వివరించిన బాలిక 

    స్పందించిన సదరు మహిళ, బాలికను తనతో పాటు తీసుకెళ్లింది. ఈ క్రమంలో 2 రోజుల క్రితం కృష్ణా జిల్లా కంకిపాడులోని ఓ వసతిగృహంలో జాయిన్ చేసేందుకు కృషి చేసింది.

    కానీ తమకు పోలీసుల నుంచి లెటర్ కావాలని, అప్పుడే చేర్చుకుంటామని హాస్టల్ నిర్వహకులు తేల్చిచెప్పారు. దీంతో కంకిపాడు ఠాణాకు వెళ్లిన బాలిక, ఎట్టకేలకు పోలీసుల నుంచి అనుమతి లేఖను పొందింది.

    అనంతరం బాలిక అక్కడి నుంచి బాలల సంక్షేమ కమిటీకి వెళ్లింది. ఆశ్రమంలో తనపై జరిగిన అరాచకాల గురించి వివరించింది. దీంతో స్వామీజీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాలికతో కలిసి కమిటీ ప్రతినిధులు విజయవాడ దిశ పోలీస్ స్టేషన్‌ ను ఆశ్రయించారు.

    మీరు
    66%
    శాతం పూర్తి చేశారు

    DETAILS

    భూముల కోసమే నాపై కుట్ర చేస్తున్నారు : స్వామీజీ

    బాలిక ఫిర్యాదు మేరకు స్వామీజీపై విజయవాడ పోలీసులు పోక్సో కేసును నమోదు చేశారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు స్వామీజీని అర్ధరాత్రి విశాఖలో అరెస్ట్ చేశారు.

    మరోవైపు బాలిక చేసిన ఆరోపణలను పూర్ణానంద స్వామీజీ ఖండించారు. ఆశ్రమానికి సంబంధించిన భూములను కొల్లగొట్టేందురు కొందరు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే తనపై కుట్రతో ఈ ఆరోపణలు చేయిస్తున్నారని చెప్పుకొచ్చారు.

    దీనిపై తాను న్యాయపోరాటం చేయనున్నట్లు స్వామీజీ వెల్లడించారు. అయితే ఆశ్రమం నుంచి బాలిక అదృశ్యమైన విషయంపై ఈ నెల 15నే ఆశ్రమ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం
    అత్యాచారం

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    విశాఖపట్టణం

    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన ఆంధ్రప్రదేశ్
    ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్! వై.ఎస్.జగన్
    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ

    అత్యాచారం

    రాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు కర్ణాటక
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం హర్యానా
    విశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక విశాఖపట్టణం
    డీఏవీ స్కూల్‌లో మైనర్ రేప్ కేసు: డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష బంజారాహిల్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025