NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / YS Sharmila: 'నా బిడ్డలపై ప్రమాణం చేస్తా, జగన్‌, సుబ్బారెడ్డి చేయగలరా?'.. సవాలు విసిరిన షర్మిళ
    తదుపరి వార్తా కథనం
    YS Sharmila: 'నా బిడ్డలపై ప్రమాణం చేస్తా, జగన్‌, సుబ్బారెడ్డి చేయగలరా?'.. సవాలు విసిరిన షర్మిళ
    'నా బిడ్డలపై ప్రమాణం చేస్తా, జగన్‌, సుబ్బారెడ్డి చేయగలరా?'.. సవాలు విసిరిన షర్మిళ

    YS Sharmila: 'నా బిడ్డలపై ప్రమాణం చేస్తా, జగన్‌, సుబ్బారెడ్డి చేయగలరా?'.. సవాలు విసిరిన షర్మిళ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 26, 2024
    05:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, వైవీ సుబ్బారెడ్డిపై విమర్శలు చేసింది. విజయవాడలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిళ మాట్లాడారు.

    సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన పిల్లలు మీ కళ్ల ముందే పెరిగారని, వారికి అన్యాయం చేయాలని ఎలా అనిపించిందంటూ షర్మిళ కన్నీరు పెట్టుకున్నారు.

    జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు సుబ్బారెడ్డి, ఆయన కుమారుడు ఆర్థికంగా లాభపడ్డారని షర్మిల అన్నారు.

    జగన్‌ పక్కన ఉంటూ ఆయనకు నమ్మకంగా పనిచేస్తున్నారని తెలిసినా సుబ్బారెడ్డి అనవసరంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమో ప్రశ్నించుకోవాలన్నారు.

    ఆస్తుల విషయంలో తనకు రావలసిన వాటా ఇవ్వకుండా సుబ్బారెడ్డి ఎలా మాట్లాడుతారంటూ షర్మిళ ఆవేదన వ్యక్తం చేశారు.

    Details

    వైసీపీ శ్రేణులు ఆలోచించుకోవాలి

    తాను చెబుతున్నది నిజమని ప్రమాణం చేయగలను అని, అయితే సుబ్బారెడ్డి చెబుతున్నది కూడా నిజమని ఆయన ప్రమాణం చేయగలరా? అంటూ షర్మిళ ప్రశ్నించారు.

    నలుగురు మనవళ్లకు ఆస్తిలో సమాన వాటా అని రాజశేఖర్‌రెడ్డి బ్రతికుండగానే చెప్పారని, ఇది తన బిడ్డలమీద ప్రమాణం చేసి చెబుతున్నానని, ఇది నిజం కాదని.. సుబ్బారెడ్డి, జగన్‌ ఇద్దరూ వారి బిడ్డలపై ప్రమాణం చేసి చెప్పగలరా? అంటూ షర్మిళ ప్రశ్నల వర్షం కురిపించింది.

    జగన్‌ తల్లిని కోర్టులోకి లాగడంపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

    జగన్‌ బలవంతంగా తన లాభం కోసం తల్లిని కోర్టులోకి లాగడమంటే ఎంత తప్పో వైసీపీ శ్రేణులు ఆలోచించుకోవాలని షర్మిళ అభిప్రాయపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైఎస్ షర్మిల
    కాంగ్రెస్

    తాజా

    Brazil : 154 అంతస్తులతో సెన్నా టవర్‌.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది బ్రెజిల్
    Kannappa: అక్షయ్ కుమార్ లుక్ సూపర్బ్… 'కన్నప్ప' రిలీజ్ డేట్ వచ్చేసింది! కన్నప్ప
    Sai Rajesh: బేబీ హిందీ రీమేక్ నుంచి 'బాబిల్ ఔట్'..? దర్శకుడు రాజేష్ స్పందన ఇదే! బాలీవుడ్
    PM Modi: గుల్జార్‌హౌస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి నరేంద్ర మోదీ

    వైఎస్ షర్మిల

    రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో? జమ్మలమడుగు
    లోటస్ పాండ్ వద్ద హై టెన్షన్; మహిళా కానిస్టేబుల్‌ను చెంపదెబ్బ కొట్టిన షర్మిల హైదరాబాద్
    కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల రావడాన్ని ఆహ్వానిస్తున్నాం : మాజీ ఎంపీ కేవీపీ కాంగ్రెస్
    సీఎం జగన్‌తో తెలంగాణ మాజీ ఎంపీ పొంగులేటీ భేటీ వై.ఎస్.జగన్

    కాంగ్రెస్

    New India-PM Modi-Pakistan: ఇది సరికొత్త భారత్...పాక్ పప్పులుడకట్లేదు: ప్రధాని నరేంద్రమోదీ నరేంద్ర మోదీ
    No funds-puri MP candidate-Sucharitha Mohanthy: డబ్బుల్లేవు ....పోటీ చేయలేనని ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుచరిత మహంతి బీజేపీ
    Telangana- Congress leader-Murder: తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో దారుణం..నాయకుడిని గొంతుకోసి హత్య చేసిన దుండగుడు హత్య
    Amarinder Singh Raja: ఎన్నికల కోసం బీజేపీ ఏమైనా చేయగలదు; పూంచ్ ఉగ్రదాడిపై ప్రశ్నలు   భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025