NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Year Ender 2024: ఈ ఏడాది దేశానికి 180 మంది ఐఏఎస్‌లు, 200 మంది ఐపీఎస్‌లు; పూర్తి జాబితా ఇదే..!
    తదుపరి వార్తా కథనం
    Year Ender 2024: ఈ ఏడాది దేశానికి 180 మంది ఐఏఎస్‌లు, 200 మంది ఐపీఎస్‌లు; పూర్తి జాబితా ఇదే..!
    ఈ ఏడాది దేశానికి 180 మంది ఐఏఎస్‌లు, 200 మంది ఐపీఎస్‌లు; పూర్తి జాబితా ఇదే..!

    Year Ender 2024: ఈ ఏడాది దేశానికి 180 మంది ఐఏఎస్‌లు, 200 మంది ఐపీఎస్‌లు; పూర్తి జాబితా ఇదే..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 30, 2024
    03:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2024 సంవత్సరానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తరువాత 2025 సంవత్సరపు ప్రారంభం అవుతుంది.

    2024 సంవత్సరాన్ని భారతీయ పరిపాలన, పోలీసు సేవలకు ఒక ప్రత్యేకమైన సంవత్సరం అని చెప్పవచ్చు.

    ఈ సంవత్సరంలో దేశవ్యాప్తంగా 180 మంది ఐఏఎస్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) అధికారులతో పాటు 200 మంది ఐపీఎస్ (ఇండియన్ పోలీసు సర్వీస్) అధికారులు ఎంపికయ్యారు.

    ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించారు.

    అలాగే, అనిమేష్ ప్రధాన్ 2వ ర్యాంక్‌, అనన్యారెడ్డి 3వ ర్యాంక్‌ను పొందారు.

    వివరాలు 

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి 27మంది ఐఏఎస్ అధికారులు

    వీరంతా యూపీఎస్‌సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్)పరీక్షలో విజయం సాధించడానికి అనేక కష్టాలు పడిన వారు.

    వారు తీవ్ర నిబద్ధతతో చదివి, ఈ పరీక్షలో ఉత్తీర్ణులై పరిపాలనా సేవలలో స్థానం సంపాదించారు.

    2024 సంవత్సరపు యూపీఎస్‌సీ ఫలితాల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అభ్యర్థులు నిలిచారు.

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి 27మంది ఐఏఎస్ అధికారులు ఎంపికయ్యారు. కాగా రాజస్థాన్ నుంచి 23 మంది అభ్యర్థులు ఐఏఎస్‌లుగా ఎంపిక అయ్యారు.

    బీహార్ రాష్ట్రం నుండి 11మంది,మధ్యప్రదేశ్ నుంచి 7మంది అభ్యర్థులు కూడా ఈ లెక్కలో ఉన్నారు.

    ఈ ఏడాది టాప్ 5 ర్యాంకుల్లో ఉన్న ముగ్గురు అభ్యర్థులు ఇప్పటికే ఐపీఎస్ అధికారులు.

    వివరాలు 

    యూపీఎస్‌సీ ద్వారా ఐఏఎస్,ఐపీఎస్,ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్ ఉద్యోగాల నియామకాలు

    ర్యాంక్ 1 సాధించిన ఆదిత్య శ్రీవాస్తవ, 4వ ర్యాంక్ సాధించిన పీకే సిద్ధార్థ్ రామ్‌కుమార్,5వ ర్యాంక్ సాధించిన రౌహానీలు ఇప్పటికే హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణను పూర్తిచేశారు.

    గత 11 సంవత్సరాలుగా సర్వీసులో ఉన్న ఒక అధికారి యూపీఎస్‌సీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించడం ఇదే తొలిసారి.

    2013లో ఐపీఎస్ అధికారి గౌరవ్ అగర్వాల్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించిన సందర్భం ఉన్నది.

    యూపీఎస్‌సీ ద్వారా ఐఏఎస్,ఐపీఎస్,ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్ ఉద్యోగాల నియామకాలు నిర్వహించబడతాయి.

    ఈ పరీక్షను మూడు దశల్లో నిర్వహిస్తారు: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రతి సంవత్సరం సుమారు 9 లక్షల నుండి 10 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సంవత్సరం ముగింపు 2024

    తాజా

    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ
    IPL 2025: మాకు అన్యాయం జరిగింది... ఐపీఎల్ అధికారులపై మండిపడ్డ కోల్‌కతా ఐపీఎల్
    Bengaluru: బెంగళూరులో దారుణం.. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యం.. బెంగళూరు

    సంవత్సరం ముగింపు 2024

    Year Ender 2024: ఈ సంవత్సరం భారతదేశాన్ని వణికించిన వ్యాధులు ఇవే..! టెక్నాలజీ
    Year Ender 2024: 2024లో క్రికెట్ కు వీడ్కోలు పలికిన ప్రముఖ క్రికెటర్లు వీళ్లే! క్రీడలు
    Year Ender 2024: 2024లో పెళ్లి చేసుకున్న 10 సినిమా సెలబ్రిటీ జంటలు వీళ్లే..? సినిమా
    Year ender 2024: ఈ ఏడాది కన్నుమూసిన ప్రముఖులు లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025