#YuvaGalam: పొదలాడ వద్ద నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం ఉదయం కోనసీమ జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం పొదలాడ నుంచి యువ గళం పాదయాత్రను పునఃప్రారంభించారు. సెప్టెంబర్ 9న స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో తన తండ్రి, టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో లోకేశ్ పొదలాడ వద్ద పాదయాత్రను నిలిపివేశారు. ఈ క్రమంలో ఆపేసిన చోటు నుంచే దాదాపు 79 రోజుల విరామం తర్వాత లోకేష్ తన పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. వాస్తవానికి పాదయాత్రను ఇచ్ఛాపురంలో ముగించాలని లోకేశ్ అనుకున్నారు. అయితే మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పాదయాత్రను విశాఖలోనే ముగించాలని లోకేశ్ భావిస్తున్నారు.