LOADING...
iPhone Users Alert:ఐఫోన్ వినియోగదారులు వెంటనే ఈ ఒక్క పని చేయాలి.. లేకుంటే వారి ఫోన్లు హ్యాక్ అయ్యే ప్రమాదం..!
లేకుంటే వారి ఫోన్లు హ్యాక్ అయ్యే ప్రమాదం..!

iPhone Users Alert:ఐఫోన్ వినియోగదారులు వెంటనే ఈ ఒక్క పని చేయాలి.. లేకుంటే వారి ఫోన్లు హ్యాక్ అయ్యే ప్రమాదం..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 12, 2026
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ఐఫోన్‌లు భద్రత పరంగా బలమైనవనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది. ఐఫోన్‌లను హ్యాక్ చేయడం అంత ఈజీ కాదని, ఎవరైనా దాడి చేయాలని ప్రయత్నిస్తే యూజర్లకు ముందుగానే హెచ్చరికలు కూడా వస్తాయని చెబుతుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో iOS కూడా బలహీనంగా మారుతున్నట్టు ఆపిల్ స్వయంగా అంగీకరించింది. తన ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్న కొన్ని లోపాలను హ్యాకర్లు వాస్తవంగా ఉపయోగించే అవకాశం ఉందని కంపెనీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఐఫోన్ వినియోగదారులు ఎలాంటి ఆలస్యం చేయకుండా తాజా iOS వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని ఆపిల్ హెచ్చరించింది. అప్‌డేట్ చేయకపోతే ఫోన్ సైబర్ దాడుల బారిన పడే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.

వివరాలు 

ఆపిల్ అధికారికంగా జారీ చేసిన భద్రతా సూచనలు 

ఇలాంటి హెచ్చరికలు తరచూ వస్తుంటాయనే భావనతో వీటిని పుకార్లుగా కొట్టిపారేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఆపిల్ అధికారికంగా జారీ చేసిన భద్రతా సూచనల ఆధారంగా వెలువడిన హెచ్చరిక. iOS‌లో కీలకమైన వెబ్‌కిట్ అనే సిస్టమ్ భాగంలో జీరో-డే దుర్బలత్వాలు ఉన్నట్టు కంపెనీ నిర్ధారించింది. వెబ్‌కిట్ అనేది సఫారీతో పాటు ఐఫోన్‌లో పనిచేసే దాదాపు అన్ని బ్రౌజర్‌లు, వెబ్ ఆధారిత యాప్‌లకు మూలశక్తి. ఈ లోపాలను ఆసరాగా చేసుకుంటే, హ్యాకర్లు ఫోన్‌లోకి కోడ్ చొప్పించడం, హానికరమైన వెబ్ కంటెంట్ ద్వారా డేటాను పొందడం వంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ దుర్బలత్వాలు ఇప్పటికే కొన్ని సైబర్ దాడుల్లో ఉపయోగించబడ్డాయని యాపిల్ స్వయంగా ఒప్పుకుంది.

వివరాలు 

 అత్యధిక ప్రమాదంలో పాత iOS వెర్షన్‌లను ఉపయోగించేవారు

ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు యాపిల్ తాజాగా ఒక సురక్షిత అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త iOS అప్‌డేట్ ద్వారా తీవ్రమైన స్థాయి లోపాలతో పాటు మరెన్నో భద్రతా సమస్యలకు ప్యాచ్‌లు అమలవుతాయని కంపెనీ తెలిపింది. పాత iOS వెర్షన్‌లను ఇంకా ఉపయోగిస్తున్నవారే అత్యధిక ప్రమాదంలో ఉన్నారని యాపిల్ స్పష్టంచేసింది. అంటే సమస్య ఫోన్ బ్రాండ్‌లో కాకుండా, పాత సాఫ్ట్‌వేర్‌లోనే ఉందని అర్థం. ఈ హెచ్చరిక ఎంత తీవ్రమైందో చెప్పేందుకు భారత ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థ CERT-In కూడా యాపిల్ పరికరాలపై హై-రిస్క్ అలర్ట్ జారీ చేసింది. iOSతో పాటు iPadOSలో కూడా పలు భద్రతా లోపాలు ఉన్నాయని CERT-In పేర్కొంది.

Advertisement

వివరాలు 

సైబర్ దాడులు ఏ ఒక్క దేశానికి లేదా ఒకే గ్రూప్‌కు పరిమితం కావు: నిపుణులు

ఇవి సాధారణ బగ్‌ల పరిష్కారం కోసం ఇచ్చిన సూచనలు కాదని, విస్తృత స్థాయిలో జరిగే దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికేనని స్పష్టం చేసింది. ఈ సైబర్ దాడులు ఏ ఒక్క దేశానికి లేదా ఒకే గ్రూప్‌కు పరిమితం కావని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీరో-డే దాడుల స్వభావం ఏమిటంటే, ఒకసారి లోపాన్ని గుర్తిస్తే దాన్ని పెద్ద ఎత్తున సామూహిక దాడుల కోసం ఉపయోగించవచ్చని చెబుతున్నారు. అందుకే యాపిల్ ఆటో-అప్‌డేట్ ఆప్షన్‌ను ఆన్‌లో ఉంచాలని, అవసరమైతే వెంటనే మాన్యువల్‌గా కూడా అప్‌డేట్ చేయాలని సూచిస్తోంది.

Advertisement

వివరాలు 

స్మార్ట్‌ఫోన్ భద్రత అనేది కేవలం హార్డ్‌వేర్‌పై ఆధారపడదు 

ఇది కేవలం "అప్‌డేట్ అందుబాటులో ఉంది" అనే సాధారణ నోటిఫికేషన్ మాత్రమే కాదని నిపుణులు అంటున్నారు. స్మార్ట్‌ఫోన్ భద్రత అనేది కేవలం హార్డ్‌వేర్‌పై ఆధారపడదని,సకాలంలో జరిగే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లే అసలైన రక్షణ అని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. అప్‌డేట్‌లను నిర్లక్ష్యం చేస్తే, ఎంత ఖరీదైన ఐఫోన్ అయినా సైబర్ దాడుల నుంచి తప్పించుకోవడం కష్టమేనని హెచ్చరిస్తున్నారు.

Advertisement