Loading...
Apple: 110 దేశాల్లో ఐఫోన్ యూజర్లకు ఆపిల్ అలర్ట్.. స్పైవేర్ దాడి ముప్పు!
110 దేశాల్లో ఐఫోన్ యూజర్లకు యాపిల్ అలర్ట్.. స్పైవేర్ దాడి ముప్పు!

Apple: 110 దేశాల్లో ఐఫోన్ యూజర్లకు ఆపిల్ అలర్ట్.. స్పైవేర్ దాడి ముప్పు!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 14, 2026
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్ సంస్థ స్పైవేర్ దాడులకు గురై ఉండే అవకాశం ఉన్న వినియోగదారులకు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఐఫోన్, ఐప్యాడ్ లేదా మ్యాక్‌లో ప్రభుత్వ స్థాయి స్పైవేర్ చొరబడి ఉండొచ్చని ఈ నోటిఫికేషన్ల ద్వారా యూజర్లను అప్రమత్తం చేస్తోంది. ఇప్పటివరకు 110 దేశాల్లో యాపిల్ ఈ హెచ్చరికలను జారీ చేసింది. ఇదే తరహా నోటిఫికేషన్ల ద్వారా 150కుపైగా దేశాల్లోని వినియోగదారులను సంస్థ అప్రమత్తం చేసింది.

వివరాలు

యూజర్లకు ఆపిల్ ఎలా హెచ్చరిస్తోంది?

వినియోగదారులు ఈ హెచ్చరికలను సులభంగా గుర్తించి, వెంటనే చర్యలు తీసుకునేలా ఆపిల్ తన నోటిఫికేషన్ విధానాన్ని మరింత మెరుగుపరిచింది.

"మీ ఐఫోన్‌ను లక్ష్యంగా చేసుకుని మెర్సినరీ స్పైవేర్ దాడిని యాపిల్ గుర్తించింది.

మీ డేటా, పరికరాన్ని రక్షించుకోవడానికి మీరు ఇప్పుడు కొన్ని చర్యలు తీసుకోవచ్చు" అని నోటిఫికేషన్‌లో పేర్కొంటోంది.

పుష్ నోటిఫికేషన్లతో పాటు యాపిల్ ఈ హెచ్చరికలను ఈమెయిల్ ద్వారా కూడా పంపిస్తోంది.

యూజర్లు తమ ఖాతాల్లోకి లాగిన్ అయినప్పుడు కూడా ఈ అలర్ట్‌లను చూపిస్తోంది.

వివరాలు

లాక్‌డౌన్ మోడ్‌ ఆన్ చేసుకోవాలని సూచన..

ఈ నోటిఫికేషన్‌లో యూజర్లను 'లాక్‌డౌన్ మోడ్'ను ఎనేబుల్ చేసుకోవాలని కూడా యాపిల్ సూచిస్తోంది.

స్పైవేర్ దాడులు విజయవంతం కావడాన్ని మరింత కష్టతరం చేసేలా ఈ సెక్యూరిటీ ఫీచర్ పనిచేస్తుంది.

లాక్‌డౌన్ మోడ్ ఆన్‌లో ఉన్న సమయంలో ఎవరైనా హ్యాక్‌కు గురైన ఘటనను తాము ఇప్పటివరకు చూడలేదని యాపిల్ తెలిపింది.

ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వాలు తమ విమర్శకులపై స్పైవేర్‌ను దుర్వినియోగం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

ఈ నేపథ్యంలో పెరుగుతున్న స్పైవేర్ ముప్పు నుంచి వినియోగదారులను రక్షించేందుకు యాపిల్ చేపడుతున్న చర్యల్లో ఈ హెచ్చరికలు కూడా భాగంగా ఉన్నాయి.

ADVERTISEMENT

వివరాలు

యాపిల్ స్పైవేర్ అలర్ట్‌లపై నిపుణుడి ప్రశంసలు..

2021లో స్పైవేర్ హెచ్చరికలను ప్రారంభించినప్పటి నుంచి యాపిల్ వాటిని మరింత మెరుగుపరుస్తోందని సిటిజన్ ల్యాబ్ సీనియర్ పరిశోధకుడు జాన్ స్కాట్-రైల్టన్ ప్రశంసించారు.

పరికరాలను సురక్షితంగా మార్చుకునేందుకు సహాయం తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించడంలో ఈ నోటిఫికేషన్లు "పెద్ద ముందడుగు" అని ఆయన పేర్కొన్నారు.

ఈ అలర్ట్‌లు కేవలం వినియోగదారులను హెచ్చరించడంతోనే ఆగిపోవడం లేదు.

అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నాయి.

దీంతో పలు సందర్భాల్లో దర్యాప్తులు ప్రారంభమై, మరిన్ని స్పైవేర్ దాడుల అవకాశాలను గుర్తించేందుకు వీలు కలుగుతోంది.

ADVERTISEMENT