NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / భారీగా కరుగుతున్న హిమనీనదాలు.. దిగువన పొంచి ఉన్న పెను ముప్పు
    తదుపరి వార్తా కథనం
    భారీగా కరుగుతున్న హిమనీనదాలు.. దిగువన పొంచి ఉన్న పెను ముప్పు
    దిగువన పొంచి ఉన్న పెను ముప్పు

    భారీగా కరుగుతున్న హిమనీనదాలు.. దిగువన పొంచి ఉన్న పెను ముప్పు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 20, 2023
    05:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రెండు వందల కోట్ల మందికిపైగా నీటిని అందిస్తున్న హిమాలయాలు భారీగా కరుగుతున్నాయి. రానున్న రోజుల్లో హిమాలయాలపై ఆధారపడిన దేశాలకు హిమనీనదాలతో తీవ్ర ప్రమాదం పొంచి ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భారీగా వరదలు సైతం సంభవించే ప్రమాదమున్నట్లు అంచనా వేసింది.

    వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే హిమాలయ గ్లేసియర్స్ చాలా వేగంగా కరిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మేరకు హిమాలయాల్లోని 200 సరస్సులు ప్రమాదకరంగా మారుతున్నాయని నివేదికలో పొందుపరిచారు.

    గడిచిన దశాబ్ధం 2011 నుంచి 2020 వరకు పోల్చితే 65 శాతం హిమనీనదాలు వేగంగా కనుమరుగవుతుండటం పట్ల ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్‌మెంట్ (ఐసీఐఎంఓడీ) నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    DETAILS

    హిమనీనదాల వల్లే కోట్లాది మంది జనానికి ఆహారం, నీరు, స్వచ్ఛమైన గాలి, ఆదాయం : జాకబ్ స్టైనర్

    వాతావరణంలో వేడి పెరుగుతున్న కొద్ధీ మన అనుకోని రీతిలో మంచు గడ్డలు కరుగుతున్నాయని ఆ సంస్థకు చెందిన పరిశోధకుడు జాకబ్ స్టైనర్ హెచ్చరించారు.

    ఓ వైపు హిందూ కుష్ హిమాలయ ప్రాంతం, మరోవైపు పర్వత పరిసరాల్లోని దాదాపుగా 2 బిలియన్లకుపైగా ప్రజలకు, ఈ నీరే ఆధారమన్నారు.

    గాల్లోకి విపరీతంగా రిలీజ్ అవుతున్న ఉద్గారాల ధాటికి ఈ శతాబ్ధం చివరి వరకు, వాటి ప్రస్తుత పరిమాణంలో 80 శాతం మేర కోల్పోవచ్చని హెచ్చరించారు.

    గంగ, సింధు, ఎల్లో, మెకాంగ్, ఐరావడ్డీ నదులతో పాటు 10 ఇతర ముఖ్యమైన నదీ వ్యవస్థకు హిమానీనదాలే కీలకంగా ఉంటాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్లాది మంది జనానికి ఆహారం, నీరు, స్వచ్ఛమైన గాలి, ఆదాయాన్ని అందిస్తున్నాయన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హిమాలయాలు
    భారతదేశం

    తాజా

    Jyoti Malhotra: విచారణలో సంచలన నిజాలు.. 'ఐఎస్‌ఐ' ఎరగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా? జ్యోతి మల్హోత్రా
    #NewsBytesExplainer: భారత్-టర్కీ సంబంధాల చరిత్ర నుంచి విభేదాల దాకా.. విశ్లేషణ భారతదేశం
    Visa: అమెరికా వీసా కోసం 13 నెలల వరకు నిరీక్షణ.. భారతీయ దరఖాస్తుదారులకు తలనొప్పి! అమెరికా
    Bullet Train: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో 300 కి.మీ వయాడక్ట్ పూర్తయింది: కేంద్ర మంత్రి వైష్ణవ్ అశ్విని వైష్ణవ్

    హిమాలయాలు

    వాతావరణ మార్పుల ఎఫెక్ట్: నీరు, విద్యుత్ సరఫరా తీవ్ర ప్రభావం; ప్రమాదంలో 16ఆసియా దేశాలు  వాతావరణ మార్పులు

    భారతదేశం

    భారత్ లో నెమ్మదిస్తున్న కొవిడ్.. కొత్తగా 237 కేసులు, 4 మరణాలు నమోదు కేంద్రమంత్రి
    సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలపై కేంద్రం దేశద్రోహం అస్త్రం : అభిషేక్ సింగ్వి కాంగ్రెస్
    ప్రజారోగ్యానికి హాని కలగొచ్చు.. అందుకే ఈ కాంబో ఔషధాలు బ్యాన్ : కేంద్రం కేంద్రమంత్రి
    ప్రమాదానికి కొద్ది క్షణాల ముందే కోరమాండల్ రాంగ్ ట్రాక్‌కి మారింది రైలు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025