Page Loader
IndiaAI Mission: రూ. 10,732 కోట్ల IndiaAI మిషన్ కింద, GPU లకు నెలరోజుల్లో టెండర్‌
రూ. 10,732 కోట్ల IndiaAI మిషన్ కింద, GPU లకు నెలరోజుల్లో టెండర్‌

IndiaAI Mission: రూ. 10,732 కోట్ల IndiaAI మిషన్ కింద, GPU లకు నెలరోజుల్లో టెండర్‌

వ్రాసిన వారు Stalin
Jun 24, 2024
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల (GPU) సేకరణ కోసం వచ్చే నెలరోజుల్లో టెండర్‌ను ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ విడుదల చేయనుంది. వీటిని దేశంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంప్యూటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం వినియోగించనున్నారు. ఇటీవల కొనసాగుతున్న ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రూ. 10,732 కోట్ల IndiaAI మిషన్ కింద, GPU ఆధారిత కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ను అందించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.

వివరాలు 

గ్యాప్ ఫండింగ్‌ను అందించాలని మంత్రిత్వ శాఖ నిశ్చయం

దాంతో పాటుగా స్టార్టప్‌లు,పరిశోధకులకు వోచర్ సిస్టమ్ ద్వారా అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతిపాదన కోసం రాబోయే అభ్యర్థన(RFP)ప్రభుత్వం ప్రారంభ GPU సామర్థ్య అవసరాలు,విస్తరణ కోసం కాలక్రమం గురించి ప్రభుత్వ ఉద్దేశాన్ని చెపుతోంది. ప్రస్తుతం,భారతదేశంలోని ఒక డేటా సెంటర్,యోట్టా డేటా సర్వీసెస్‌లో మాత్రమే AI GPUలు ఉన్నాయి. ఇతర దేశాల్లోని డేటా సెంటర్‌లు/క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హులా కాదా అనే విషయాన్ని కూడా RFP స్పష్టం చేస్తుందని భావిస్తున్నారు. గ్లోబల్ పార్టనర్‌షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(GPAI)రెండవ ఎడిషన్‌ను జూలై 3-4 వరకు నిర్వహించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. GPAI కంప్యూట్ కెపాసిటీ, ఫౌండేషన్ మోడల్స్, డేటాసెట్‌లు, అప్లికేషన్ డెవలప్‌మెంట్ ఇతర సంబంధిత అంశాలపై దృష్టి పెడుతుందని వారు తెలిపారు.

వివరాలు 

GPAI తొలి ప్రతిపాదన భారత్ నుంచే 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాధ్యతాయుతమైన అభివృద్ధి , వినియోగానికి మార్గనిర్దేశం చేయడానికి స్థాపించించారు. దీని అంతర్జాతీయ చొరవ అయిన GPAI ప్రస్తుత ప్రధాన చైర్‌గా భారతదేశం ఉంది. ఈ చొరవలో దాదాపు 29 దేశాలు సభ్యులుగా ఉన్నాయి.రెండవ ఎడిషన్ గ్లోబల్ ఇండియాఏఐ సమ్మిట్‌గా పేరు మార్చారు. గ్లోబల్ సౌత్ దేశాలలో AIపై సంభాషణను ప్రోత్సహిస్తుంది. ప్రముఖ అంతర్జాతీయ AI నిపుణులు హాజరవుతారు. AI దాని సవాళ్లపై వారికి అంతర్దృష్టుల(Insights)ను అందించాలని భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ప్రాజెక్ట్‌లను చేపట్టే విద్యార్థుల కోసం ఐఐటిలు, ఎన్‌ఐటిలు మొదలైన వాటితో సహా 50 ఇన్‌స్టిట్యూట్‌ల నుండి నామినేషన్లను ఆహ్వానించింది . తద్వారా ఇటీవల మంత్రిత్వ శాఖ ఇండియాఎఐ మిషన్‌ను ప్రారంభించింది.