Loading...
NASA : చంద్రుడిపై భారీ బిలం.. రెండేళ్ల తర్వాత గుర్తించిన నాసా
చంద్రుడిపై భారీ బిలం.. రెండేళ్ల తర్వాత గుర్తించిన నాసా

NASA : చంద్రుడిపై భారీ బిలం.. రెండేళ్ల తర్వాత గుర్తించిన నాసా

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 17, 2026
01:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

చంద్రుడిపై భారీ కొత్త బిలాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. 2024లో ఓ అంతరిక్ష శిల ఢీకొనడంతో ఏర్పడిన ఈ బిలం.. ఇటీవలి కాలంలో చంద్రుడిపై ఏర్పడిన అతిపెద్ద ప్రభావ బిలంగా గుర్తింపు పొందింది. నాసాకు చెందిన లూనార్‌ రికానైసెన్స్‌ ఆర్బిటర్‌ (LRO) తీసిన చిత్రాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రుడికి భూమి వైపు కనిపించే భాగంలో ఏర్పడిన ఈ బిలం సుమారు 728అడుగులు (222 మీటర్లు) వెడల్పు,141 అడుగుల (43 మీటర్లు) లోతు ఉంది. గతంలో ఎల్‌ఆర్‌ఓ గుర్తించిన అతిపెద్ద కొత్త బిలంతో పోలిస్తే ఇది మూడు రెట్లకుపైగా పెద్దదని పరిశోధకులు తెలిపారు. ఇంతటి బిలం ఏర్పడే స్థాయి ఢీకొట్టు సుమారు 132ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

వివరాలు 

రెండేళ్ల తర్వాత వెలుగులోకి..

దీంతో చంద్రుడి ఉపరితలంపై అంతరిక్ష ఢీకొట్ల ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ఈ ప్రదేశం అరుదైన అవకాశంగా మారింది.

2024 మేలో గ్రహశకలం లేదా తోకచుక్క నుంచి విడిపోయిన ఓ ముక్క చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టింది.

అంతరిక్ష శిల బలంగా ఢీకొన్నప్పటికీ.. భూమిపై, అంతరిక్షంలో ఉన్న టెలిస్కోపులు ఆ ఘటనను వెంటనే గుర్తించలేకపోయాయి.

అయితే, చంద్రుడిపై అంతరిక్ష శిల ఢీకొన్న తర్వాత కొద్దిసేపటికే ఎల్‌ఆర్‌ఓ ఆ ప్రాంతాన్ని విస్తృత కోణంలో చిత్రీకరించింది.

అంతరిక్ష నౌక సేకరించిన భారీ మొత్తంలో డేటా మధ్య ఆ చిత్రాలు శాస్త్రవేత్తల దృష్టికి వెంటనే రాలేదు. చివరకు 2025 ఆగస్టులో పరిశోధకులు ఆ బిలాన్ని గుర్తించారు.

వివరాలు 

రెండేళ్ల తర్వాత వెలుగులోకి..

ఆ తర్వాత ఎల్‌ఆర్‌ఓ మరోసారి ఆ ప్రాంతాన్ని పరిశీలించి, అదే ఏడాది శరదృతువులో మరింత స్పష్టమైన చిత్రాలను తీసింది.

ఈ ఏడాది ప్రారంభంలో శాస్త్రవేత్తలు ఆ బిలం ఏర్పాటును ధ్రువీకరించారు.

అనంతరం ఆ ఘటన వల్ల చంద్రుడి ఉపరితలం, చుట్టుపక్కల ప్రాంతాలపై పడిన ప్రభావాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.

ఈ బిలానికి ఇటీవల కన్నుమూసిన థామస్‌ మెక్‌గెట్చిన్‌ పేరు పెట్టారు. ఆయన గతంలో హ్యూస్టన్‌లోని లూనార్‌ అండ్‌ ప్లానెటరీ ఇన్‌స్టిట్యూట్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు.

ADVERTISEMENT

వివరాలు 

చంద్రుడిపై 100 కిలోమీటర్ల మేర ప్రభావం

కొత్తగా ఏర్పడిన ఈ బిలం.. చంద్రుడిపై భారీ అంతరిక్ష వస్తువు ఢీకొన్న తర్వాత ఏర్పడిన ప్రభావాలను నేరుగా అధ్యయనం చేసే అరుదైన అవకాశాన్ని శాస్త్రవేత్తలకు కల్పించింది.

అంతరిక్ష శిల ఢీకొన్న ప్రభావం చంద్రుడి ఉపరితలంపై 100 కిలోమీటర్లకు పైగా విస్తరించినట్లు పరిశోధకులు గుర్తించారు.

చంద్రుడి లోపలి పొరల్లోని మట్టి, రాళ్లు అంతరిక్ష శిల ఢీకొన్న సమయంలో బయటకు ఎగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో పడ్డాయి.

ఎల్‌ఆర్‌ఓలోని కెమెరాల ప్రధాన శాస్త్రవేత్త, ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ పరిశోధకుడు మార్క్‌ రాబిన్సన్‌ ఈ విషయాన్ని వివరించారు.

చంద్రుడిని ఢీకొన్న అంతరిక్ష శిల ప్రభావంతో వెలువడిన ధూళి, రాతి పదార్థాలు తాము ఊహించిన దానికంటే ఎక్కువ కోణంలో పైకి ఎగిరినట్లు తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

చంద్రుడిపై 100 కిలోమీటర్ల మేర ప్రభావం

ఈ ఆవిష్కరణపై ప్రచురితమైన రెండు పరిశోధనా పత్రాల్లో ఒకదానికి ఆయన ప్రధాన రచయితగా ఉన్నారు. ఈ పరిశోధన బుధవారం 'సైన్స్‌ అడ్వాన్సెస్‌' జర్నల్‌లో ప్రచురితమైంది.

కొత్తగా ఏర్పడిన ఈ బిలాన్ని.. కాలక్రమంలో చంద్రుడి ఉపరితలంపై జరిగే మార్పులు దాని అసలు రూపాన్ని మార్చకముందే అధ్యయనం చేసే అరుదైన అవకాశంగా శాస్త్రవేత్తలు అభివర్ణించారు.

ఇలాంటి ఘటనలు గణాంకపరంగా చాలా అరుదుగా జరుగుతాయని, జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే పరిశీలించే అవకాశం లభించేంత ప్రత్యేకమైనవని పేర్కొన్నారు.

వివరాలు 

చంద్రుడి మట్టిలో మార్పులకు ఆధారాలు

బిలం చుట్టూ సుమారు 7 కిలోమీటర్ల విస్తీర్ణంలో చల్లటి ప్రాంతం ఉన్నట్లు మరో పరిశోధనలో గుర్తించారు.

చంద్రుడి పై పొరలోని మట్టి లేదా రెగోలిత్‌ (Regolith) వదులుగా మారడం, కదలికలకు గురికావడం వల్ల ఈ ప్రాంతం ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, లాస్‌ ఏంజెలెస్‌కు చెందిన పరిశోధకుడు డేవిడ్‌ పైజ్‌ ఈ ప్రక్రియను తోటపని పనితో పోల్చారు.

చంద్రుడిపై అంతరిక్ష వస్తువులు ఢీకొన్నప్పుడు ఉపరితలంలోని మట్టి పొరలు తిరగబడతాయని, లోపల ఉన్న పదార్థాలు పైకి వస్తాయని వివరించారు.

వివరాలు 

చంద్రుడి మట్టిలో మార్పులకు ఆధారాలు

అంతరిక్ష వస్తువులు ఢీకొనడం వల్ల చంద్రుడి ఉపరితలంలోని మట్టి కలియదిరుగుతుందని ఇప్పుడు శాస్త్రవేత్తలు భావిస్తున్నారని పైజ్‌ తెలిపారు.

నాసా ఎల్‌ఆర్‌ఓ 2009లో ప్రయోగించినప్పటి నుంచి సేకరించిన పరిశీలనలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి.

కొత్తగా ఏర్పడిన అనేక బిలాల అధ్యయనాల ద్వారా చంద్రుడి ఉపరితలాన్ని కప్పి ఉన్న పదార్థాలు గతంలో అంచనా వేసిన దానికంటే వేగంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారుతున్నట్లు తెలుస్తోంది.

చంద్రుడిపై అంతరిక్ష వస్తువులు ఢీకొన్నప్పుడు ఎగిరిన పదార్థాలు తిరిగి ఉపరితలంపై పడుతుంటాయి.

ఈ ప్రక్రియతో చంద్రుడి పైభాగంలోని సుమారు 2 సెంటీమీటర్ల మట్టి పొర దాదాపు 80 వేల ఏళ్లకు ఒకసారి మారుతుందని రాబిన్సన్‌ తెలిపారు.

వివరాలు 

భవిష్యత్‌ చంద్ర మిషన్లకు ఉపయోగం

ఈఆవిష్కరణ చంద్రుడి భూగర్భ నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికే కాకుండా..భవిష్యత్‌ మానవ మిషన్లకు కూడా ఉపయోగపడే అవకాశముంది.

చంద్రుడిపై వ్యోమగాముల కోసం స్థావరం ఏర్పాటు చేయాలన్న ప్రణాళికలతో నాసా ముందుకు సాగుతోంది.

ఈ నేపథ్యంలో భారీ అంతరిక్ష ఢీకొట్టు వల్ల ఎగిరిన పదార్థాలు భవిష్యత్‌ చంద్ర స్థావరాల వైపు ఎంత దూరం ప్రయాణించగలవన్నది పరిశోధకులు తెలుసుకోవాలనుకుంటున్నారు.

ఆ పదార్థాలు ఎంత దూరం,ఏ దిశలో ప్రయాణిస్తాయో అర్థం చేసుకోవడం ద్వారా భవిష్యత్‌ స్థావరాలు, పరికరాలకు ఎదురయ్యే ప్రమాదాలను అంచనా వేయవచ్చు.

కొత్తగా ఏర్పడే బిలాల నుంచి వెలువడే పదార్థాల వల్ల కలిగే ముప్పును లెక్కించడం తదుపరి దశ అని రాబిన్సన్‌ తెలిపారు.

ఈసమాచారం ఆధారంగా ఇంజినీర్లు స్థావరాలను మరింత రక్షణగా నిర్మించేందుకు చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు.

వివరాలు 

కోట్ల ఏళ్లుగా మారుతున్న చంద్రుడి ఉపరితలం

చంద్రుడి ఉపరితలంపై కోట్ల ఏళ్లుగా గ్రహశకలాలు, తోకచుక్కలు ఢీకొంటూనే ఉన్నాయి.

వాటి ప్రభావంతో ఏర్పడిన కొన్ని భారీ బిలాలు వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి.

వాటిలో ఒకటి 2,400 కిలోమీటర్లకుపైగా వెడల్పుతో ఉంది. వీటితో పోలిస్తే తాజాగా గుర్తించిన బిలం చాలా చిన్నదే.

అయితే, ఇది ఇటీవల ఏర్పడటం వల్ల శాస్త్రవేత్తలకు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

పురాతన బిలాల అసలు లక్షణాలు సుదీర్ఘ కాలంలో మారిపోయి ఉంటాయి.

వివరాలు 

కోట్ల ఏళ్లుగా మారుతున్న చంద్రుడి ఉపరితలం

కానీ ఈ కొత్త బిలం ద్వారా అంతరిక్ష వస్తువు ఢీకొన్నప్పుడు చంద్రుడి మట్టి ఎలా బయటకు ఎగిరిపోతుంది, ఎలా విస్తరిస్తుంది, ఉపరితలాన్ని ఎలా మార్చుతుంది అనే విషయాలను స్పష్టంగా అధ్యయనం చేయవచ్చు.

చంద్రుడిపై వ్యోమగాములు వేసిన అడుగుల ముద్రలు చాలా కాలం అలాగే ఉంటాయన్న అభిప్రాయాన్ని కూడా ఈ పరిశోధన ప్రశ్నిస్తోంది.

చంద్రుడి ఉపరితల పదార్థాలు నిరంతరం తిరగబడుతుండటంతో అపోలో వ్యోమగాముల అడుగుల ముద్రలు కూడా భవిష్యత్తులో చెరిగిపోతాయని రాబిన్సన్‌ తెలిపారు.

ADVERTISEMENT