NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Palem: సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి 40 దేశాల నుండి శాస్త్రవేత్తలు తెలంగాణలోని ఈ గ్రామానికి ఎందుకు వచ్చారో తెలుసా?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Palem: సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి 40 దేశాల నుండి శాస్త్రవేత్తలు తెలంగాణలోని ఈ గ్రామానికి ఎందుకు వచ్చారో తెలుసా?
    Palem: సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి 40 దేశాల నుండి శాస్త్రవేత్తలు

    Palem: సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి 40 దేశాల నుండి శాస్త్రవేత్తలు తెలంగాణలోని ఈ గ్రామానికి ఎందుకు వచ్చారో తెలుసా?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 17, 2025
    05:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నాగర్‌కర్నూలు జిల్లాలోని బిజినేపల్లి మండలానికి చెందిన 'పాలెం' అనే చిన్న గ్రామం ఒకప్పుడు ప్రపంచాన్ని ఆకర్షించింది.

    సాదా సీదా ఈ గ్రామం 1980వ సంవత్సరంలో శాస్త్రవేత్తలు, అంతరిక్ష పరిశోధకుల తాకిడి కారణంగా ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

    1980లో పాలెంలో సందడి చేసిన శాస్త్రవేత్తలు

    పాలెం గ్రామం ఇతర గ్రామాల మాదిరిగానే కనిపించినా, 1980 ఫిబ్రవరి 16న జరిగిన సంపూర్ణ సూర్యగ్రహణం ఈ ఊరిని ప్రపంచ పటంలో ప్రత్యేకంగా నిలిపింది.

    సరిగ్గా ఆ రోజున గ్రామం వద్ద గ్రహణం స్పష్టంగా కనిపించబోతుందన్న గణనలతో అనేక మంది శాస్త్రవేత్తలు అక్కడికి చేరుకున్నారు.

    వివరాలు 

    అమెరికన్ పరిశోధనా సంస్థల సహకారం 

    అమెరికాలోని 'నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రీసర్చ్'కి చెందిన 'హై ఆల్టిట్యూడ్ అబ్జర్వేటరీ' ఈ గ్రహణాన్ని చిత్రీకరించేందుకు ప్రత్యేక కెమెరాను పాలెంకు పంపింది.

    గార్డన్ న్యూక్రిక్ ఆ కెమెరా రూపకల్పన చేశారు. ఈ అభివృద్ధితో, పాలెం గ్రామం సౌర పరిశోధనల్లో కీలక పాత్ర పోషించింది.

    భారత శాస్త్రవేత్తల పరిశోధన

    ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా బృందం మీడియాకి తెలిపిన ప్రకారం, ఆ సమయంలో చేపట్టిన పరిశోధనలు సూర్యుని వలయాన్ని (కరోనాను) లోతుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి.

    అదే సంవత్సరం 'ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా' వారి జర్నల్‌లో "అబ్జర్వేషన్ ఆఫ్ టోటల్ సోలార్ ఎక్లిప్స్ ఆఫ్ ఫిబ్రవరి 16, 1980" అనే శీర్షికతో పరిశోధన పత్రం ప్రచురించబడింది.

    వివరాలు 

    శాస్త్రవేత్తల బృందం 

    వీపీ గౌర్, కేఆర్ బొండాల్, కే సిన్హా, జీసీ జోషి, ఎంసీ పాండే అనే శాస్త్రవేత్తలు ఈ పత్రాన్ని రచించారు.

    వారు తమ పరిశోధన కోసం హైదరాబాద్‌కు పశ్చిమాన 110 కిలోమీటర్ల దూరంలోని పాలెం గ్రామాన్ని ఎంచుకున్నట్టు పేర్కొన్నారు.

    ప్రభుత్వాల సహకారం

    ఈ పరిశోధనలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా తోడ్పడగా, అమెరికాకు చెందిన స్మిత్‌సోనియన్ ఆస్ట్రోఫిజికల్ అబ్జర్వేటరీ కూడా తన సహకారాన్ని అందించింది.

    శాస్త్రవేత్తల ప్రకారం, ఇది 20వ శతాబ్దంలో భారతదేశంలో కనిపించిన మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం.

    వివరాలు 

    పాలెంలో 40 దేశాల శాస్త్రవేత్తలు 

    శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వెబ్‌సైట్ ప్రకారం, 1980 ఫిబ్రవరిలో జరిగిన ఈ గ్రహణాన్ని పరిశీలించేందుకు 40 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పాలెంకు వచ్చారు. వారు దాదాపు 40 రోజుల పాటు అక్కడే బస చేసి పరిశోధనలు కొనసాగించారు.

    గ్రహణాల పరిశీలనకు ఉన్న ప్రాముఖ్యత

    శాస్త్రవేత్తలు తక్కువసార్లే కనిపించే సంపూర్ణ సూర్యగ్రహణాలను వినూత్నంగా అధ్యయనం చేయడానికి విశేష ప్రాధాన్యత ఇస్తారు. ప్రాచీనకాలంలో హీలియం గ్యాస్‌ను గ్రహణ సమయంలోనే గుర్తించారని పేర్కొంటూ, సూర్యునిపై లోతైన అవగాహన కోసం ఈ అవకాశాలు ఎంత విలువైనవో ప్లానెటరీ సొసైటీ నిర్వాహకులు రఘునందన్ చెప్పారు.

    వివరాలు 

    పాలెం ఎలా ఎంపికైందంటే... 

    ఒక గ్రహణాన్ని పరిశీలించడానికి 'అంబ్రా పాథ్' అనే మార్గం అత్యంత చీకటి ప్రాంతంగా గుర్తించబడుతుంది.

    పాలెం ఆ మార్గంలో ఉండటంతో, దాదాపు నాలుగు నిమిషాలపాటు గ్రహణాన్ని చూసే అవకాశం ఉండేదని శాస్త్రవేత్తలు తెలిపారు.

    అంతేకాకుండా అక్కడ ఆకాశం నిర్మలంగా ఉండటమూ కీలక పాత్ర పోషించింది.

    పరిశీలనల్లో వినూత్న పద్ధతులు

    నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రీసర్చ్ వారు పాలెంలో ప్రత్యేక కెమెరా అమర్చారు.

    అక్కడ తీసిన ఫోటోలు సౌర గ్రహణాల ఫోటోగ్రఫీలో కొత్త తీరును సూచించాయి. అప్పటి వరకు అభివృద్ధి చెందుతున్న పరిశీలన పద్ధతుల్లో ఇది ఒక మైలురాయి అయింది.

    ముఖ్యంగా సూర్యుని ఔటర్ కరోనాలోని మధ్యభాగాన్ని అధ్యయనం చేయడంలో ఇది పెద్ద దోహదం చేసింది.

    వివరాలు 

    పాలెం పరిశోధన వల్ల వచ్చిన ముఖ్యమైన విషయాలు: 

    సూర్యుని కరోనా హై-రెజల్యూషన్ చిత్రాలు లభించాయి.

    కరోనాలోని సంక్లిష్టమైన అయస్కాంత నిర్మాణాలపై అవగాహన పెరిగింది.

    భూ వాతావరణం, ఐనోస్ఫియర్‌పై సూర్యుడి ప్రభావాన్ని విశ్లేషించడంలో సహాయపడింది.

    భారత, అమెరికా శాస్త్రవేత్తలు కలిసి పనిచేసే అవకాశాన్ని కల్పించింది.

    అప్పట్లో గ్రహణాన్ని పరిశీలించేందుకు శాస్త్రవేత్తలు తమ పరికరాలతో ఒక ఊరినే ఆశ్రయించాల్సి వచ్చేది. కానీ, ప్రస్తుతం వారు అవసరమైతే కృత్రిమ గ్రహణాలే సృష్టించగలిగే స్థాయికి చేరుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో పాలెం ఒక చారిత్రాత్మక మైలురాయి అయింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    తెలంగాణ

    Heavy rains: తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌! భారీ వర్షాలు
    Bomb threat: మేడ్చల్‌ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపులు భారతదేశం
    Inter : తెలంగాణ ఇంటర్ బోర్డు 2025-26 అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల  భారతదేశం
    TG Sanna Biyyam : రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం కొరత - లబ్ధిదారుల ఆగ్రహం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025