Page Loader
Arshdeep Singh: ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేతగా అర్ష్‌దీప్‌ సింగ్‌
ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేతగా అర్ష్‌దీప్‌ సింగ్‌

Arshdeep Singh: ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేతగా అర్ష్‌దీప్‌ సింగ్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2025
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేతగా భారత క్రికెటర్ అర్షదీప్ సింగ్ ఎంపికయ్యారు. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, జింబాబ్వే నుండి ఒక్కొక్కరు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయ్యారు. ట్రావిస్ హెడ్, సికందర్ రాజా, బాబర్ ఆజం, అర్షదీప్ సింగ్‌ను ఐసీసీ నామినేట్ చేసింది. వారిలో నుంచి అర్షదీప్ సింగ్ విజేతగా నిలిచినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. యువ పేసర్ అర్షదీప్ సింగ్ చాలాకాలంగా టీ20 క్రికెట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2024 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లోనూ అద్భుత ప్రదర్శనతో సత్తా చాటాడు.

Details

అరుదైన రికార్డుకు చేరువలో అర్షదీప్ సింగ్

ఎనిమిది మ్యాచ్‌లలో 7.16 ఎకానమీతో 17 వికెట్లు తీసిన అర్షదీప్, ఈ టోర్నీలో కీలక బౌలర్‌గా నిలిచాడు. 2024లో మొత్తం 18 మ్యాచ్‌లలో 36 వికెట్లు తీసి, 13.50 సగటుతో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో (4/9) సంచలన బౌలింగ్‌తో అర్షదీప్ ఆకట్టుకున్నాడు. టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు (97) తీసిన బౌలర్‌గా కూడా అర్షదీప్ నిలిచాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో రెండు వికెట్లు తీసి ఈ ఘనతను అందుకున్నాడు. ఇంకో 3 వికెట్లు తీస్తే టీ20ల్లో 100 వికెట్లు తీసిన ప్రథమ భారత బౌలర్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. .