LOADING...
MS Dhoni: ధోనీ ఆతిథ్యం మరువలేనిది.. బ్రాడ్‌కాస్టర్ భావన పోస్ట్ వైరల్
ధోనీ ఆతిథ్యం మరువలేనిది.. బ్రాడ్‌కాస్టర్ భావన పోస్ట్ వైరల్

MS Dhoni: ధోనీ ఆతిథ్యం మరువలేనిది.. బ్రాడ్‌కాస్టర్ భావన పోస్ట్ వైరల్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 08, 2025
02:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ క్రికెటర్ ఎం ఎస్ ధోని తన స్నేహితులు,అభిమానులకు చాలా గౌరవం,విలువ చూపిస్తాడు. కుటుంబంతో కలవాలని ఉందని చేసిన విజ్ఞప్తిని మరువకుండా.. ఆతిథ్యం ఇచ్చాడని బాలకృష్ణన్ అనే బ్రాడ్‌కాస్టర్, టీవీ ప్రెజెంటర్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ధోనీ ఇచ్చిన ఆతిథ్యం చూశాక మాటలు రావడం లేదని ఆనందం వ్యక్తం చేశారు. తన తల్లి, భర్త, స్నేహితులతో కలిసి ధోనీని కలిసిన సందర్భంలో తీసుకున్న ఫొటోలతో కూడిన పోస్టును పంచుకున్నారు.

వివరాలు 

 మమ్మల్ని ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చారు.

''కొన్ని జ్ఞాపకాలు జీవితకాలం గుర్తుండిపోతాయి.నేను ధోనీని ఒకసారి మాత్రమే కలవాలని అభ్యర్థించాను.కానీ ఆయన చూపిన స్పందన అసాధారణం.మమ్మల్ని స్వయంగా ఆహ్వానించి ఆతిథ్యం కల్పించారు.నా తల్లితో కాస్తసేపు మాట్లాడటం జరిగింది. నా భర్త, స్నేహితులతో కూడా ఆయన సంభాషించారు. క్రికెట్ బ్యాట్ మీద ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. నేను ఒక గృహిణిగా,ఒక కుమార్తెగా,ఒక స్నేహితురాలిగా ఈకారణం వల్లనే ఎంతో పొందగలిగాను. ఈమాటలకు కారణం ఎం.ఎస్. ధోనీ. ఎన్నేళ్లయినా సరే అవతలివారిని మరీ ఎక్కువగా అడిగించుకోకుండా విలువ ఇచ్చే వ్యక్తి.

వివరాలు 

ఇది ఆయన విధేయతకు చిహ్నం

ప్రతి సారి ఆయన స్పందించే విధానం, ఆతిథ్యం అసాధారణంగా ఉంటాయి. ఇది ఆయన విధేయతకు గుర్తుగా చెప్పొచ్చు. ఇది అన్నీ చెన్నై స్టైల్ నుంచి వచ్చే వైఖరే. చెన్నై నగరంలో నేర్చుకున్న విలువలను ధోనీ ప్రతిరోజూ జీవిస్తున్నాడని గతంలో చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి. ప్రతి రోజు ఇలానే ధోనీ జీవించటం నిజంగా గర్వంగా ఉంది. ధన్యవాదాలు ఎం.ఎస్'' అని భావన తన సోషల్ మీడియా ఖాతాలో రాశాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బ్రాడ్‌కాస్టర్ భావన పోస్ట్ వైరల్