Shaharyar Khan: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ కన్నుమూత
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ (89) శనివారం, మరణించినట్లు పీసీబీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఖాన్ డిసెంబర్ 2003 నుండి అక్టోబరు 2006 వరకు, ఆగస్టు 2014 నుండి ఆగస్టు 2017 వరకు రెండు పర్యాయాలు PCB చీఫ్గా పనిచేశారు. అయన ప్రపంచ కప్ 2003, 1999లో భారత పర్యటనలో జాతీయ పురుషుల జట్టుకు మేనేజర్ గా కూడా పనిచేశాడు. 2023లో, షహర్యార్ పీసీబీ చైర్మన్గా జనరల్ తౌకిర్ జియా నుంచి బాధ్యతలు స్వీకరించారు. 2014లో, ఇస్లామాబాద్ హైకోర్టు జాకా అష్రఫ్ను మే 2013లో తిరిగి సస్పెండ్ చేయడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు.
పీసీబీ చైర్మన్ గా మొహ్సిన్ నఖ్వీ
లాహోర్లో శనివారం ఉదయం తుది శ్వాస విడిచిన ఖాన్ కుటుంబానికి PCB సానుభూతి తెలిపింది. గత దశాబ్దంలో పాకిస్థాన్కు క్రికెట్ను తిరిగి తీసుకురావడంలో కీలక పాత్రధారిగా అతనిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని ఆకాంక్షించారు. ఫిబ్రవరి నెలలో పీసీబీ మొహ్సిన్ నఖ్వీని ఛైర్మన్గా చేసి, 3 సంవత్సరాల పదవీకాలానికి నియమించింది. పీసీబీ మాజీ చైర్మన్ షహర్యార్ ఖాన్ మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని, విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను అని నఖ్వీ తెలిపారు.
న్యూజిలాండ్కు ఆతిథ్యమివ్వడానికి సిద్దమైన పాకిస్థాన్
పాకిస్తాన్ 5 మ్యాచ్ల T20 సిరీస్లో న్యూజిలాండ్కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తొలి మూడు టీ20 మ్యాచ్లు ఏప్రిల్ 18, 20, 21 తేదీల్లో రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. దీని తర్వాత మిగిలిన 2 మ్యాచ్లు ఏప్రిల్ 25, 27 తేదీల్లో లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరగనున్నాయి.