Page Loader
Asia Cup 2024: అక్టోబర్ 19న హైవోల్టేజ్‌ మ్యాచ్‌.. భారత్‌-పాకిస్తాన్‌ పోరుకు తిలక్‌ వర్మ సారథ్యం!
అక్టోబర్ 19న హైవోల్టేజ్‌ మ్యాచ్‌.. భారత్‌-పాకిస్తాన్‌ పోరుకు తిలక్‌ వర్మ సారథ్యం!

Asia Cup 2024: అక్టోబర్ 19న హైవోల్టేజ్‌ మ్యాచ్‌.. భారత్‌-పాకిస్తాన్‌ పోరుకు తిలక్‌ వర్మ సారథ్యం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 15, 2024
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏసీసీ పురుషుల ఎమర్జింగ్ టీమ్స్ టీ20 ఆసియా కప్ 2024 అక్టోబర్ 18న ఒమన్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 8 దేశాల ఏ జట్లు పాల్గొంటున్నాయి. టోర్నీ గ్రూప్ దశ మరింత ఆసక్తికరంగా మారనుంది. గ్రూప్-ఏలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, శ్రీలంక జట్లు ఉండగా, గ్రూప్-బీలో భారత్, ఒమన్, పాకిస్థాన్, యూఏఈ జట్లు పోటీపడనున్నాయి. ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ దశ ముగిసిన తర్వాత తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌ చేరుకుంటాయి. సెమీస్‌ అక్టోబర్ 25న, ఫైనల్‌ అక్టోబర్ 27న జరగనున్నాయి.

Details

జట్టును ప్రకటించిన బీసీసీఐ

భారత్-ఏ జట్టు సారథ్య బాధ్యతలను యువ ఆటగాడు తిలక్ వర్మకు అప్పగిస్తూ, బీసీసీఐ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. తిలక్ వర్మతో పాటు ఐపీఎల్‌ స్టార్స్‌ అయిన అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నేహాల్ వదేరా, వైభవ్ అరోరా, సాయి కిశోర్‌ జట్టులో ఉన్నారు. భారత్ తొలి మ్యాచ్‌ అక్టోబర్ 19న పాకిస్థాన్‌తో జరగనుంది. తర్వాతి మ్యాచులు అక్టోబర్ 21న యూఏఈతో, అక్టోబర్ 23న ఒమన్‌తో జరుగుతాయి. భారత్ మ్యాచులు సాయంత్రం 5.30కి ఆరంభం కానున్నాయి.

Details

భారత్ తలపడే జట్లు ఇవే

ఆసియా కప్‌కు భారత్-ఏ జట్టు తిలక్ వర్మ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, అనుజ్ రావత్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నేహాల్ వదేరా, అన్షుల్ కాంబోజ్, హృతిక్ షోకీన్, ఆకిబ్ ఖాన్, వైభవ్ అరోరా, రసీక్ సలామ్, సాయి కిశోర్, రాహుల్ చహర్. షెడ్యూల్ ఇదే అక్టోబర్ 19: భారత్ vs పాకిస్థాన్ అక్టోబర్ 21: భారత్ vs యూఏఈ అక్టోబర్ 23: భారత్ vs ఒమన్ అక్టోబర్ 25: సెమీఫైనల్-1, సెమీఫైనల్-2 అక్టోబర్ 27: ఫైనల్