LOADING...
Ravichandran Ashwin: నెదర్లాండ్స్‌పై భారత్ పూర్తి సామర్థ్యం చూపలేదు : రవిచంద్రన్ అశ్విన్
నెదర్లాండ్స్‌పై భారత్ పూర్తి సామర్థ్యం చూపలేదు : రవిచంద్రన్ అశ్విన్

Ravichandran Ashwin: నెదర్లాండ్స్‌పై భారత్ పూర్తి సామర్థ్యం చూపలేదు : రవిచంద్రన్ అశ్విన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2026
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా తన గ్రూప్‌ దశను విజయవంతంగా ముగించింది. ఇప్పుడు సూపర్‌-8లో అసలు సవాళ్లు ఎదురుకానున్నాయి. ఈ దశలో భారత్‌ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ జట్లతో తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌పై తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. సూర్యకుమార్ యాదవ్ చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా బ్యాటింగ్‌ చేశాడని అశ్విన్ పేర్కొన్నాడు. శివమ్‌ దూబె, హర్దిక్ పాండ్యా, రింకు సింగ్‌లు వేగంగా పరుగులు సాధించే ప్రయత్నం చేశారని చెప్పాడు. అయితే నెదర్లాండ్స్‌పై టీమ్‌ఇండియా బ్యాటింగ్‌లో పూర్తి ఆధిపత్యం కనబరచలేకపోయిందని, తమ సంపూర్ణ సామర్థ్యాన్ని ప్రదర్శించలేదని అభిప్రాయపడ్డాడు.

Details

తిలక్ వర్మ ఆటతీరు అద్భుతం

అయినప్పటికీ వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని, అతడి మిస్టరీ బౌలింగ్‌ను నెదర్లాండ్స్ బ్యాటర్లు అర్థం చేసుకోలేకపోయారని చెప్పాడు. అలాగే జస్పిత్ బుమ్రా పవర్‌ప్లేలో స్వింగ్‌ రాబట్టి, కచ్చితమైన యార్కర్లు సంధించాడని అశ్విన్ తన యూట్యూబ్‌ ఛానల్‌లో విశ్లేషించాడు. పొట్టి ఫార్మాట్‌లో తిలక్ వర్మ ప్రదర్శనపైనా అశ్విన్ మాట్లాడాడు. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన తిలక్‌ పవర్‌ హిట్టర్‌ కాదని, కానీ టైమింగ్‌, గ్యాప్స్‌లో ఆడటంలో అతడు నైపుణ్యం కలవాడని పేర్కొన్నాడు. క్రికెట్‌లో కేవలం పెద్ద షాట్లు కొట్టడమే కాదు, బంతిని సమయానికి తాకించి గ్యాప్స్‌లోకి పంపడం కూడా అంతే ముఖ్యమని చెప్పాడు.

Details

గ్రూప్ 8కు అర్హత సాధించిన జట్లు ఇవే

కొందరు వైభవ్ సూర్యవంశీలా భారీ షాట్లతో ఆడతారని, మరికొందరు తిలక్‌ వర్మలా టైమింగ్‌తో పరుగులు సాధిస్తారని అశ్విన్ వివరించాడు. ఇక సూపర్‌-8కు అర్హత సాధించిన జట్ల వివరాలు ఇలా ఉన్నాయి గ్రూప్‌ ఏ నుంచి భారత్‌, పాకిస్థాన్‌; గ్రూప్‌ బి నుంచి శ్రీలంక, జింబాబ్వే; గ్రూప్‌ సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లాండ్‌; గ్రూప్‌ డి నుంచి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ తదుపరి దశకు చేరుకున్నాయి.

Advertisement