LOADING...
India vs Pakistan: మళ్లీ షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోని భారత్‌-పాక్‌ కెప్టెన్లు
మళ్లీ షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోని భారత్‌-పాక్‌ కెప్టెన్లు

India vs Pakistan: మళ్లీ షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోని భారత్‌-పాక్‌ కెప్టెన్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 15, 2026
08:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌లో భారత్ మరియు పాకిస్థాన్ జట్లు ఎదుర్కొన్న మ్యాచ్‌లో ఆసక్తికరమైన పరిణామం జరిగింది. టాస్ తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు ఒకరికొకరు షేక్‌హ్యాండ్‌ ఇవ్వకుండానే తమ స్థానాలకు వెళ్లిపోయారు. పాకిస్థాన్ కెప్టెన్ టాస్‌ గెలిచి, టీమ్‌ఇండియాను ఫస్ట్‌ బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాక్ మధ్య ఇరు జట్లు ఇప్పటివరకు ఎనిమిది సార్లు ఎదుర్కొన్నాయి. అందులో భారత్ ఏడుసార్లు విజయం సాధించగా, పాకిస్థాన్ ఒకసారి మాత్రమే గెలిచింది. భారత్-పాక్ సంబంధాలు ''ఆపరేషన్‌ సిందూర్'' తరువాత మరింత క్షీణమయ్యాయి. ఈ నేపధ్యంలో పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా, భారత క్రికెట్ జట్టు వివిధ సందర్భాల్లో నిరసన వ్యక్తం చేస్తుంది.

Details

గతంలో కూడా ఇదే ఘటన

గతేడాది దుబాయ్‌లో జరిగిన ఆసియాకప్‌లో టాస్ సమయంలో టీమ్‌ఇండియా ఆటగాళ్లు పాక్ జట్టుకు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. ఆ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. ఆట ముగిసిన తర్వాత కూడా ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు కరచాలనం చేయలేదు. అదే టోర్నమెంట్‌లో సూపర్‌ ఫోర్‌ దశలో కూడా ఇరు జట్లు ఇదే విధానాన్ని కొనసాగించాయి. అంతకుముందు, 2025 ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్‌, ఐసీసీ పురుషుల అండర్‌-19వరల్డ్‌కప్‌లోనూ భారత్-పాక్ ఆటగాళ్లు కరచాలనానికి దూరంగా ఉండేవారు. కానీ అంధుల మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో విరుద్ధంగా పరిణామం చోటు చేసుకుంది. ఆ మ్యాచ్‌లో ఆట ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు షేక్‌హ్యాండ్ ఇచ్చారు. ఇంకా, స్టేడియానికి ఇరు జట్లు ఒకే బస్సులో చేరడం కూడా గమనార్హం.

Advertisement