LOADING...
Team India History: టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత జట్టు అరుదైన మైలురాయి
టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత జట్టు అరుదైన మైలురాయి

Team India History: టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత జట్టు అరుదైన మైలురాయి

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2026
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ ఎన్నో ఘన విజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా పరుగుల తేడాతో సాధించిన భారీ గెలుపులు జట్టు ఆధిపత్యాన్ని స్పష్టంగా ప్రతిబింబించాయి. ప్రత్యర్థులను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టేస్తూ భారత్ సాధించిన ఈ విజయాలు టోర్నమెంట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందాయి. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ సాధించిన అతిపెద్ద విజయం నమీబియాపై నమోదైంది. 2026లో ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇండియా క్రికెట్ టీం 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇది కేవలం భారత్‌కే కాదు, మొత్తం టోర్నమెంట్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో రెండో స్థానంలో 2012లో ఇంగ్లాండ్‌పై 90 పరుగుల తేడాతో సాధించిన విజయం ఉంది.

Details

ఆస్ట్రేలియాపై 73 పరుగుల తేడాతో గెలుపు

ఆ మ్యాచ్ కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించి ఇంగ్లాండ్‌ను పూర్తిగా అదుపులో పెట్టింది. మూడో స్థానంలో 2014లో ఆస్ట్రేలియాపై 73 పరుగుల భారీ గెలుపు ఉంది. ఈ మ్యాచ్ మిర్పూర్‌లో జరిగింది. అలాగే 2022లో మెల్బోర్న్ వేదికగా జింబాబ్వేపై జరిగిన మ్యాచ్‌లో భారత్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2024 సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 68 పరుగుల తేడాతో గెలిచిన మ్యాచ్ కూడా విశేషం. నాకౌట్ మ్యాచ్‌లో ఇలాంటి భారీ విజయం సాధించడం భారత్ స్థిరత్వాన్ని, పెద్ద మ్యాచ్‌ల్లో ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని చూపిస్తుంది.

Details

15న పాకిస్థాన్ తో ఢీ

మొత్తంగా ఈ రికార్డులు టీ20 ఫార్మాట్‌లో భారత్ ఎంత బలమైన జట్టో తెలియజేస్తున్నాయి. భారీ మార్జిన్ విజయాలు అంటే కేవలం గెలుపే కాదు, ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం. ఆ విషయంలో భారత్ ప్రపంచ క్రికెట్‌కు పదేపదే తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్ 2026 కొనసాగుతోంది. ఇప్పటికే అమెరికా, నమీబియాపై భారత్ విజయాలు నమోదు చేసింది. ఇక ఫిబ్రవరి 15న దాయాది పాకిస్థాన్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు జట్టు సిద్ధమవుతోంది.

Advertisement