LOADING...
England: భారత్‌-ఇంగ్లాండ్‌ సెమీఫైనల్‌ పోరు: రహస్య అస్త్రాలు లేవన్న సామ్‌ కరన్
ఒకరి బలాబలాలు మరొకరికి తెలుసు: సామ్‌ కరన్

England: భారత్‌-ఇంగ్లాండ్‌ సెమీఫైనల్‌ పోరు: రహస్య అస్త్రాలు లేవన్న సామ్‌ కరన్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 04, 2026
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌లో వరుసగా మూడోసారి సెమీఫైనల్‌లో తలపడుతున్న భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఎలాంటి రహస్య అస్త్రాలు లేవని ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ తెలిపాడు. రెండు జట్లూ ఒకరి ఆటతీరు, వ్యూహాలు గురించి బాగా తెలిసి ఉండటంతో ఆశ్చర్యాలు ఏవీ ఉండవని అన్నాడు. గురువారం ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న సెమీఫైనల్‌లో తమ జట్టు మంచి ప్రదర్శన చేసి ఫైనల్‌కు చేరుతుందని కరన్‌ నమ్మకం వ్యక్తం చేశాడు.

వివరాలు 

రెండు జట్ల ఆటగాళ్ల బలాబలాలు పరస్పరం బాగా తెలుసు: సామ్‌ కరన్

''వాంఖడే స్టేడియంలో మేము ఇప్పటికే అనేక మ్యాచ్‌లు ఆడాం. అక్కడి మైదానం కొలతలు, పరిస్థితులు, డ్రెస్సింగ్‌ రూమ్‌ వాతావరణం అన్నీ మాకు బాగా పరిచయం. ఐపీఎల్‌ వల్ల భారత ఆటగాళ్లతో కలిసి కూడా చాలా క్రికెట్‌ ఆడాం. అందుకే రెండు జట్ల ఆటగాళ్ల బలాబలాలు పరస్పరం బాగా తెలుసు. ఎలాంటి రహస్యాలు లేవు'' అని కరన్‌ చెప్పాడు. గత ఫిబ్రవరిలో ఇదే వాంఖడే మైదానంలో అభిషేక్‌ తమపై కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులు సాధించిన విషయాన్ని కూడా అతను గుర్తు చేశాడు. ''అతను మళ్లీ అలాంటి ఇన్నింగ్స్‌ ఆడకూడదని ఆశిస్తున్నాం. అభిషేక్‌ను అడ్డుకునేందుకు ప్రత్యేక ప్రణాళికలతో మేము సిద్ధంగా ఉన్నాం'' అని సామ్‌ కరన్‌ వెల్లడించాడు.

Advertisement