దంచికొట్టిన ఆర్సీబీ బ్యాటర్లు; ముంబై ఇండియన్స్ లక్ష్యం 200పరుగులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో భాగంగా వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు దించికొట్టారు. ఆర్సీబీ నిర్ణీత 20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ముంబయి ఇండియన్స్ ముందు 200పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఆర్సీబీ బ్యాటింగ్కు ఆహ్వానించారు. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి 1రన్కు ఔటైనా ఫాఫ్ డు ప్లెసిస్(65), గ్లెన్ మాక్స్వెల్ (68) ఫోర్లు, సిక్సులతో విభృంభించారు.