ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. భారత జట్టు ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. వన్డే సిరీస్ కోసం బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. అయితే మొదటి వన్డే నుంచి రోహిత్ శర్మ తప్పుకున్నారు.
ఈ మ్యాచ్లో అతని స్థానంలో హార్ధిక్ పాండ్యా నాయకత్వ బాధ్యతలు తీసుకున్నారు. అదే సమయంలో కేఎల్ రాహుల్తో పాటు విరాట్ కోహ్లీ, ఇతర ప్రముఖ ఆటగాళ్లు జట్టులో చోటు సంపాదించారు.
తొలి వన్డేలో వ్యక్తిగత కారణాల ఆస్ట్రేలియాతో జరిగే తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండనని బీసీసీఐ పేర్కొంది. మిడిలార్డర్లో కోహ్లీ, శ్రేయాస్అయ్యర్ , సూర్యకుమార్యాదవ్ బ్యాట్స్మెన్గా ఉన్నారు. ఆల్ రౌండర్ జాబితాలో హార్ధిక్పాండ్యాతో పాటు, రవీంద్రజడేజా, వాషింగ్టన్సుందర్, శార్దూల్ఠాకూర్, అక్షర్పటేల్ ఎంపికయ్యారు.
టీమిండియా
వన్డే సిరీస్ కోసం ఎంపికైన భారత జట్టు ఇదే
ఫాస్ట్ బౌలింగ్లో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, జయదేవ్ ఉనద్కత్లు జట్టులో ఉన్నారు.
ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్లో తొలి మ్యాచ్ మార్చి 17వ తేదీన ముంబైలో, రెండో మ్యాచ్ మార్చి 19వ తేదీన విశాఖపట్నంలో, చివరి వన్డే మార్చి 22వ తేదీన చెన్నైలో జరగనున్నాయి.
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్