Page Loader
Virat Kohli: విరాట్ కోహ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మకుటం లేని మహారాజు: మహ్మద్ కైఫ్
విరాట్ కోహ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మకుటం లేని మహారాజు: మహ్మద్ కైఫ్

Virat Kohli: విరాట్ కోహ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మకుటం లేని మహారాజు: మహ్మద్ కైఫ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 22, 2025
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన దూకుడైన ఆటతీరుతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీసుల్లో అతడు నిరాశపరిచాడు. ఈ సందర్భంలో, అతడి ఆటతీరు పేలవంగా మారింది. ఆఫ్‌సైడ్ బంతులను వెంటాడుతూ వికెట్‌ను సమర్పించే బలహీనతతో కోహ్లీ అవుట్ అయ్యాడు. అయినా అతడు విఫలమవడంతో వన్డేల్లో అతడి ప్రదర్శన గురించి మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఒక కీలక వ్యాఖ్య చేశాడు. విరాట్ కోహ్లీ ఎప్పుడూ ఓటమిని అంగీకరించడని, అతడు తిరిగి పునరాగమనం చేస్తాడని కైఫ్ ధీమా వ్యక్తం చేశారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడిని తక్కువగా అంచనా వేయకూడదన్నారు.అతడికి వన్డేల్లో 50 సెంచరీలు ఉన్నాయని, 14 వేలకు దగ్గరగా పరుగులు చేశాడని పేర్కొన్నారు.

Details

రంజీ ట్రోఫీలో ఆడనున్న కోహ్లీ

దుబాయ్‌లో అతడి రికార్డు చాలా బలంగా ఉందని, అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 బంతుల్లో 122 పరుగులు చేశారని కైఫ్ గుర్తు చేశారు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతాడని తాను ఆశిస్తున్నానని తెలిపారు. ఇక టెస్టుల్లో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీలో మళ్లీ ఆడడానికి సిద్ధమయ్యాడు. 2012లో చివరి సారి రంజీ మ్యాచ్ ఆడిన కోహ్లీ ఇప్పుడు 13 సంవత్సరాల తర్వాత దిల్లీ జట్టులో మళ్లీ ఆడనున్నాడు. రంజీ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ గురువారం ప్రారంభమవుతుంది. మెడ నొప్పి కారణంగా కోహ్లీ ఆడతాడా అనే వార్తలు వచ్చాయి, కానీ దిల్లీ క్రికెట్ సంఘం అతడు సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్‌లో ఆడతాడని వెల్లడించింది.