NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Pakistan: సింధు నదిలో 33 టన్నుల బంగారం నిల్వల గుర్తింపు
    తదుపరి వార్తా కథనం
    Pakistan: సింధు నదిలో 33 టన్నుల బంగారం నిల్వల గుర్తింపు
    సింధు నదిలో 33 టన్నుల బంగారం నిల్వల గుర్తింపు

    Pakistan: సింధు నదిలో 33 టన్నుల బంగారం నిల్వల గుర్తింపు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 12, 2025
    10:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌, అటోక్ జిల్లాలో సింధూ నది లోయలో భారీగా బంగారం నిల్వలను గుర్తించారు.

    ఈ నిల్వలు దాదాపు 32.6 టన్నుల బంగారమని, వాటి విలువ రూ.18 వేల కోట్లు (600 బిలియన్‌ పాకిస్థానీ రూపాయలు) ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

    జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్థాన్ (జీఎస్‌పీ) ఈ వివరాలను ధ్రువీకరించింది. పాక్‌లో ప్రస్తుతం నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు అధికంగా ఉన్నాయి.

    దీంతో జల జీవితం కష్టంగా మారిందని చెప్పొచ్చు. అలాగే వరుస ఉగ్రదాడులతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

    ఈ క్రమంలో సింధూ నది లోయలో బంగారం నిల్వలు వెలికితీశారు. ఈ వార్త పాకిస్థాన్ ప్రజలకు కొత్త ఆశల్ని నింపింది.

    Details

    నిత్యావసరాల ధరలు తగ్గే అవకాశం

    బంగారం వెలికితీయడం ప్రారంభం కాగానే, పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థకు పునరుద్ధరణ దిశగా మార్పులు వచ్చే అవకాశం ఉంది. తద్వారా దేశపు అప్పుల భారాన్ని తగ్గించి, కరెన్సీ విలువను బలోపేతం చేసుకోవచ్చు.

    ఫలితంగా నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు తగ్గడం ద్వారా ప్రజలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది.

    పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ ప్రకటన చేయడంతో, సింధూ నది లోని బంగారం నిల్వలు వెలికితీయడం ప్రారంభించడానికి పూర్తిగా దృష్టి పెట్టామని తెలిపారు.

    32 కిలోమీటర్ల పరిధిలో బంగారం నిల్వలు వ్యాపించాయన్నారు.

    అలాగే పంజాబ్ ప్రావిన్స్, ఖైబర్ ఫంఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా బంగారం నిల్వలను గుర్తించామన్నారు.

    Details

    అక్రమ మైనింగ్ పై నిషేధం

    పెషావర్ బేసిన్, మర్దాన్ బేసిన్‌లలో కూడా బంగారం నిల్వలు ఉన్నాయని చెప్పారు.

    ఈ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌పై నిషేధం అమలు చేస్తామని, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే బంగార గనుల్లో మైనింగ్‌ జరుగుతుందని స్పష్టం చేశారు.

    సింధు నది, పాకిస్థాన్‌లో ప్రవహించి హిమాలయాల్లోకి చేరుతుంటుంది. ఈ నది పరివాహక ప్రాంతంలో టెక్టోనిక్‌ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉండటం వల్ల బంగారం అణువులు ఏర్పడతాయి.

    అవి నది ప్రవాహం ద్వారా పాకిస్థాన్‌ లోని ఇతర ప్రాంతాల్లో విస్తరిస్తాయి. ఈ నిరంతర ప్రవాహం వల్ల శతాబ్దాల పాటు బంగారం అణువులు సింధు నది లోయలో పేరుకుపోయాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    ప్రపంచం

    తాజా

    Covid 19: నెల్లూరులో కరోనా డేంజర్ బెల్స్ .. ఒకేసారి ఆరు కేసులు నెల్లూరు నగరం
    Akhil Akkineni: వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్.. వైరల్ అవుతున్న ఫోటోలు  అక్కినేని అఖిల్
    PM Modi: నేడు జమ్ముకశ్మీర్‌లో మోదీ పర్యటన.. చీనాబ్ వంతెన ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
    Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన కేసు.. ఆర్సీబీ మార్కెటింగ్‌ హెడ్‌ అరెస్టు  బెంగళూరు

    పాకిస్థాన్

    Mohammad Rizwan: పాక్ కెప్టెన్ గా మహ్మద్ రిజ్వాన్.. ప్రకటించిన పాక్ క్రికెట్ బోర్డు  క్రికెట్
    Gary Kirsten: పాక్‌కు గుడ్‌బై చెప్పిన గ్యారీ కిరిస్టెన్‌..కొత్త కోచ్ కోసం పీసీబీ పావులు! క్రికెట్
    Pakistan: లాహోర్ సిటీలో దారుణంగా రికార్డైన ఏక్యూఐ.. భారత్‌ను నిందించిన పాక్  అంతర్జాతీయం
    Pakistan: కరాచీలో కాల్పులు.. ఇద్దరు చైనా పౌరులకు గాయాలు  అంతర్జాతీయం

    ప్రపంచం

    Imran Khan: ఇమ్రాన్ ఖాన్ విడుదలకు పోరాటం.. పాకిస్థాన్‌లో భారీ నిరసనలు పాకిస్థాన్
    Bangladesh: బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ నిషేధానికి పిటిషన్.. హైకోర్టు ఆదేశాలపై ఉత్కంఠ బంగ్లాదేశ్
    Temples Vandalized: బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై రాళ్ల దాడి.. నిరసన వ్యక్తం చేసిన హిందువులు బంగ్లాదేశ్
    SIPRI: యుద్ధాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలు ఆయుధాల విక్రయాలను పెంచుతున్నాయి: సిప్రి నివేదిక అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025