NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Earthquake: పసిఫిక్ ద్వీప దేశం వనాటులో 7.3 తీవ్రతతో భూకంపం 
    తదుపరి వార్తా కథనం
    Earthquake: పసిఫిక్ ద్వీప దేశం వనాటులో 7.3 తీవ్రతతో భూకంపం 
    పసిఫిక్ ద్వీప దేశం వనాటులో 7.3 తీవ్రతతో భూకంపం

    Earthquake: పసిఫిక్ ద్వీప దేశం వనాటులో 7.3 తీవ్రతతో భూకంపం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 17, 2024
    12:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని వనౌటు దేశంలో మంగళవారం తీవ్ర భూకంపం సంభవించింది.

    రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం, దేశంలోని అతిపెద్ద నగరమైన పోర్ట్ విలా నుండి పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో కేంద్రాన్ని కలిగి ఉంది.

    భూకంపం తర్వాత అదే ప్రాంతంలో 5.5 తీవ్రతతో పలుమార్లు ప్రకంపనలు నమోదయ్యాయి.

    ఈ విపత్తు కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు, మరికొన్ని సెకన్లపాటు గడిచేలోపే భూమి గట్టిగా కంపించింది.

    వివరాలు 

    దెబ్బతిన్న అమెరికా, ఫ్రాన్స్ దేశాల ఎంబసీలు 

    భూకంప ప్రభావంతో పలు భవనాలు నేలకూలాయి, ముఖ్యంగా పోర్ట్ విలాలో ఉన్న పలు దేశాల రాయబార కార్యాలయ భవనం భారీగా ధ్వంసమైంది.

    ఈ భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాల ఎంబసీలు ఉన్నాయి, అయితే పై అంతస్తులు కూలిపోవడం వల్ల ఈ కార్యాలయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

    ఈ పరిణామాల కారణంగా ఆయా ఎంబసీలు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాయి.

    భూకంపం వల్ల ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, మొత్తం నష్టంపై ఇప్పుడే అంచనాకు రావడం సాధ్యం కాదని అధికారులు తెలిపారు.

    వివరాలు 

     ప్రజలు భయంతో పరిగెడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ 

    ప్రభుత్వ వెబ్‌సైట్లు పనిచేయకపోవడం, పోలీసు స్టేషన్లు,ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఫోన్లు సమర్థంగా కనెక్ట్ అవ్వకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి.

    భూకంప సమయంలో ప్రజలు భయంతో పరిగెడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

    వనౌటు దేశం 80 చిన్న చిన్న దీవుల సముదాయంగా ఉండి, 3.30 లక్షల మంది జనాభాతో రింగ్ ఆఫ్ ఫైర్ జోన్‌లో ఉంది.

    ఈ కారణంగా అక్కడ తరచుగా ప్రకంపనలు సంభవిస్తుంటాయి. తాజా భూకంపం తరువాత తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, కొద్దిసేపటి తరువాత వాటిని వెనక్కి తీసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భూకంపం

    తాజా

    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్

    భూకంపం

    World Round 2023: ఈ ఏడాది విపత్తులు మిగిల్చిన విషాదాలు. భీకర యుద్ధాలివే! ఇండియా
    Earthquakes: జపాన్ తీరానికి సమీపంలో వరుసగా రెండు భూకంపాలు   జపాన్
    Earthquake: జపాన్‌లో 7.4 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జపాన్
    Japan: జపాన్‌లో వెంటవెంటనే 21 భూకంపాలు.. భారత ఎంబసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు జపాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025