NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / కరోనా విజృంభణ వేళ.. భారత జెనరిక్ ఔషధాల కోసం ఎగబడుతున్న చైనీయులు
    తదుపరి వార్తా కథనం
    కరోనా విజృంభణ వేళ.. భారత జెనరిక్ ఔషధాల కోసం ఎగబడుతున్న చైనీయులు
    చైనా బ్లాక్ మార్కెట్‌లో భారతీయ కరోనా జనరిక్ ఔషధాలు

    కరోనా విజృంభణ వేళ.. భారత జెనరిక్ ఔషధాల కోసం ఎగబడుతున్న చైనీయులు

    వ్రాసిన వారు Stalin
    Dec 29, 2022
    01:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చైనాలో కరోనా వీరవిహారం చేస్తోంది. ఒమిక్రాన్ బీఎఫ్.7తో ఉక్కిరిబిక్కరి అవుతున్న బీజింగ్‌లో ఇప్పుడు.. ఔషధార కొరత ఏర్పడింది. మహమ్మారి నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చైనీయులు భారతీయ ఔషధాలను ఆశ్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో అవి లభ్యం కాకపోవడంతో.. బ్లాక్ మార్కెట్ కొని మరీ.. వినియోగిస్తున్నారు.

    కరోనా విజృంభణతో దేశంలో ఔషధాల వినియోగం భారీగా పెరిగింది. ఫైజర్స్ పాక్స్‌లోవిడ్ తోపాటు చైనీస్ సంస్థ జెన్యూన్ బయోటెక్‌కు చెందిన అజ్వుడిన్ మందులను మాత్రమే కరోనా యాంటీవైరల్‌ డ్రగ్‌గా వినియోగించేందుకు ఆ‌దేశం అనుమతిచ్చింది.

    ప్రస్తుత డిమాండ్‌కు తగ్గట్లు.. ఆ మందుల సరఫరా లేకపోవడంతో.. అక్కడి ప్రజలు బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు. ఆ మందుల్లో భారత్‌కు చెందిన జనరిక్ మెడిసిన్స్ ఎక్కువగా ఉండటం గమనార్హం.

    చైనా

    తక్కువ ధరకు భారతీయ ఔషధాలు

    భారత్ చెందిన నాలుగు రకాల జెనరిక్ యాంటీ కోవిడ్ ఔషధాలు చైనా బ్లాక్ మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. అందులో ప్రిమోవిర్, పాక్సిస్టా, మోల్నునాట్, మోల్నాట్రిస్ మందులు ఉన్నాయి. కోవిడ్ నుంచి రక్షణ కల్పిస్తుండటంతోపాటు.. తక్కువ ధరకు లభిస్తుండటంతో చైనీయులు ఎక్కువ సంఖ్యలో ఈ భారతీయ ఔషధాలను కోనుగోలు చేస్తున్నారు.

    చైనాకు చెందిన 'పాక్స్‌లోవిడ్' ఒక్కో‌బాక్స్‌కు 2,980 యువాన్‌లు ఖర్చవుతుండగా.. భారత్‌కు చెందిన జనరిక్ ఔషధాలు ఒక్కో బాక్స్ 530 నుంచి 1,600 యువాన్ల మధ్య లభ్యమవుతోంది.

    వాస్తవానికి భారతీయ జనరిక్ మందుల విక్రయానికి చైనాలో అనుమతి లేదు. 'వీబో' లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో మేసేజ్‌లను షేర్ చేసుకుంటూ.. భారతీయ జనరిక్ మందులను అక్కడి ప్రజలు బ్లాక్‌లో పొందుతున్నట్లు సౌత్‌చైనా మార్నింగ్ పోస్ట్ చెబుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా
    కోవిడ్

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    చైనా

    శక్తివంతమైన ఇంజన్‌తో వస్తున్న MBP C650V క్రూయిజర్ ఆటో మొబైల్
    చైనాలో అందుబాటులోకి వచ్చిన Redmi K60 సిరీస్ ఆండ్రాయిడ్ ఫోన్

    కోవిడ్

    మళ్లీ కరోనా భయాలు.. పాజిటివ్ కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం భారతదేశం
    కరోనా కథ ముగిసిపోలేదు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం: కేంద్రం భారతదేశం
    'భారత్ జూడో యాత్ర'కు కరోనా షాక్.. రాహుల్‌కు కేంద్రం లేఖ భారతదేశం
    భారత్‌లో జూలైలోనే బయటపడ్డ కరోనా 'BF.7'.. భయమంతా రీఇన్ఫెక్షన్‌తోనే.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025