NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / కరోనా విజృంభణ వేళ.. భారత జెనరిక్ ఔషధాల కోసం ఎగబడుతున్న చైనీయులు
    అంతర్జాతీయం

    కరోనా విజృంభణ వేళ.. భారత జెనరిక్ ఔషధాల కోసం ఎగబడుతున్న చైనీయులు

    కరోనా విజృంభణ వేళ.. భారత జెనరిక్ ఔషధాల కోసం ఎగబడుతున్న చైనీయులు
    వ్రాసిన వారు Naveen Stalin
    Dec 29, 2022, 01:58 pm 1 నిమి చదవండి
    కరోనా విజృంభణ వేళ.. భారత జెనరిక్ ఔషధాల కోసం ఎగబడుతున్న చైనీయులు
    చైనా బ్లాక్ మార్కెట్‌లో భారతీయ కరోనా జనరిక్ ఔషధాలు

    చైనాలో కరోనా వీరవిహారం చేస్తోంది. ఒమిక్రాన్ బీఎఫ్.7తో ఉక్కిరిబిక్కరి అవుతున్న బీజింగ్‌లో ఇప్పుడు.. ఔషధార కొరత ఏర్పడింది. మహమ్మారి నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చైనీయులు భారతీయ ఔషధాలను ఆశ్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో అవి లభ్యం కాకపోవడంతో.. బ్లాక్ మార్కెట్ కొని మరీ.. వినియోగిస్తున్నారు. కరోనా విజృంభణతో దేశంలో ఔషధాల వినియోగం భారీగా పెరిగింది. ఫైజర్స్ పాక్స్‌లోవిడ్ తోపాటు చైనీస్ సంస్థ జెన్యూన్ బయోటెక్‌కు చెందిన అజ్వుడిన్ మందులను మాత్రమే కరోనా యాంటీవైరల్‌ డ్రగ్‌గా వినియోగించేందుకు ఆ‌దేశం అనుమతిచ్చింది. ప్రస్తుత డిమాండ్‌కు తగ్గట్లు.. ఆ మందుల సరఫరా లేకపోవడంతో.. అక్కడి ప్రజలు బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు. ఆ మందుల్లో భారత్‌కు చెందిన జనరిక్ మెడిసిన్స్ ఎక్కువగా ఉండటం గమనార్హం.

    తక్కువ ధరకు భారతీయ ఔషధాలు

    భారత్ చెందిన నాలుగు రకాల జెనరిక్ యాంటీ కోవిడ్ ఔషధాలు చైనా బ్లాక్ మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. అందులో ప్రిమోవిర్, పాక్సిస్టా, మోల్నునాట్, మోల్నాట్రిస్ మందులు ఉన్నాయి. కోవిడ్ నుంచి రక్షణ కల్పిస్తుండటంతోపాటు.. తక్కువ ధరకు లభిస్తుండటంతో చైనీయులు ఎక్కువ సంఖ్యలో ఈ భారతీయ ఔషధాలను కోనుగోలు చేస్తున్నారు. చైనాకు చెందిన 'పాక్స్‌లోవిడ్' ఒక్కో‌బాక్స్‌కు 2,980 యువాన్‌లు ఖర్చవుతుండగా.. భారత్‌కు చెందిన జనరిక్ ఔషధాలు ఒక్కో బాక్స్ 530 నుంచి 1,600 యువాన్ల మధ్య లభ్యమవుతోంది. వాస్తవానికి భారతీయ జనరిక్ మందుల విక్రయానికి చైనాలో అనుమతి లేదు. 'వీబో' లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో మేసేజ్‌లను షేర్ చేసుకుంటూ.. భారతీయ జనరిక్ మందులను అక్కడి ప్రజలు బ్లాక్‌లో పొందుతున్నట్లు సౌత్‌చైనా మార్నింగ్ పోస్ట్ చెబుతోంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    కోవిడ్
    చైనా

    తాజా

    ప్రయోగం తర్వాత కక్ష్యను చేరుకోవడంలో విఫలమైన ప్రపంచంలోని మొదటి 3డి-ప్రింటెడ్ రాకెట్ టెక్నాలజీ
    IPL: పంజాబ్ కింగ్స్ కి బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం ఐపీఎల్
    శుక్ర గ్రహాన్ని అన్వేషించే మిషన్‌ 2028లో ప్రారంభం: ఇస్రో ఛైర్మన్ ఇస్రో
    అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో కొత్త వివాదం; టిప్పు సుల్తాన్‌ను ఎవరు చంపారు? కర్ణాటక

    కోవిడ్

    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నరేంద్ర మోదీ
    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; కొత్తగా 918మందికి వైరస్, నలుగురు మృతి కరోనా కొత్త మార్గదర్శకాలు
    దేశంలో 4నెలల గరిష్ఠానికి కరోనా కేసులు; కేంద్రం ఆందోళన భారతదేశం
    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు మహారాష్ట్ర

    చైనా

    Find X6, X6 Pro స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించిన OPPO స్మార్ట్ ఫోన్
    Ernie బాట్ నిరాశపరచడంతో పతనమైన బైడు షేర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    'భారతదేశంలో అరుణాచల్ అంతర్భాగం'; చైనా సరిహద్దును మెక్‌మహన్ రేఖగా గుర్తిస్తూ అమెరికా తీర్మానం అరుణాచల్ ప్రదేశ్
    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశం

    అంతర్జాతీయం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    World Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023