NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ 
    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Stalin
    May 20, 2023
    09:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జీ7 సదస్సులో పాల్గొనేందుకు ఫ్యూమియో కిషిడా ఆహ్వానం మేరకు జపాన్‌కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

    విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం నరేంద్ర మోదీ, మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

    అనంతరం హిరోషిమాలో ప్రధాని మోదీ విలేకరులతో మాట్లాడుతూ.. నేటికీ హిరోషిమా అనే పదం వింటేనే ప్రపంచం భయపడుతోందని అన్నారు.

    జీ7 సదస్సు కోసం జపాన్‌లో పర్యటించిన సందర్భంగా మహాత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం తనకు లభించిందన్నారు.

    హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహం అహింస ఆలోచనను ముందుకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    తాను జపాన్ ప్రధానికి బహుమతిగా ఇచ్చిన బోధి వృక్షాన్ని హిరోషిమాలో నాటారని తెలుసుకున్నాక తాను చాలా సంతోషించినట్లు చెప్పారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మహాత్ముడికి నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ

    PM @narendramodi unveils a bust of Mahatma Gandhi in Hiroshima, Japan. pic.twitter.com/RmZobqj9d2

    — PMO India (@PMOIndia) May 20, 2023

    జపాన్

    జపాన్ ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ; ద్వైపాక్షిక అంశాలపై చర్చ 

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హిరోషిమాలో జపాన్ పీఎంతో ఫ్యూమియో కిషిదాతో సమావేశమయ్యారు. వాణిజ్యం, ఆర్థిక, సంస్కృతితో సహా వివిధ రంగాలలో భారతదేశం-జపాన్ స్నేహాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు.

    జీ7 శిఖరాగ్ర సమావేశానికి భారతదేశాన్ని ఆహ్వానించినందుకు మోదీ జపా‌న్ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. బోధి వృక్షం పెరుగుదలతో పాటు భారతదేశం-జపాన్ సంబంధాలు పెరుగుతాయని తాను నమ్ముతున్నట్లు మోదీ ట్వీట్ చేశారు.

    ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఇక్కడి ప్రవాస భారతీయులతో హిరోషిమాలోని ఒక హోటల్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రవాసులు "భారత్ మాతా కీ జై", "వందేమాతరం" అంటూ, ప్రధాని మోదీని అభినందిస్తూ నినాదాలు కూడా చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    జపాన్-భారత్ ద్వైపాక్షిక భేటీ

    PM @narendramodi met PM @kishida230 in Hiroshima. Both leaders discussed ways to enhance India-Japan friendship across different sectors including trade, economy and culture. pic.twitter.com/FaYWYtm0Tl

    — PMO India (@PMOIndia) May 19, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జపాన్
    భారతదేశం
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    జపాన్

    ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి కరోనా కొత్త మార్గదర్శకాలు
    జపాన్ మార్కెట్ లో Sneaker షూ లాంటి డిజైన్ తో Nissan కిక్స్ 327 ఎడిషన్ ప్రదర్శన ఆటో మొబైల్
    'వాషింగ్టన్ పోస్ట్' సంచలన కథనం: భారత్ సహా అనేక దేశాలపై బెలూన్లతో చైనా నిఘా చైనా
    ఉక్రెయిన్‌కు అండగా జీ7 దేశాలు; రష్యాపై మరిన్ని ఆంక్షలు ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    భారతదేశం

    ఆరుసార్లు పెరిగిన తర్వాత, రెపో రేటును 6.5% నుండి పెంచని ఆర్‌బిఐ ఆర్ బి ఐ
    రష్యా చమురు భారతదేశం ద్వారా యూరప్‌లోకి బ్యాక్‌డోర్‌ ద్వారా ప్రవేశం ఆటో మొబైల్
    2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్, చైనాలదే: ఐఎంఎఫ్ ఐఎంఎఫ్
    డోక్లామ్ సమీపంలో చైనా భారీ సైనిక నిర్మాణాలు; భారత్ ఆందోళన  చైనా

    నరేంద్ర మోదీ

    ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య మధ్యప్రదేశ్
    ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లపై గుజరాత్ హైకోర్టు కీలక ఆదేశాలు ప్రధాన మంత్రి
    సూరత్ న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ నేడు సెషన్స్ కోర్టులో రాహుల్ అప్పీల్ రాహుల్ గాంధీ
    ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ పొందిన నేతల జాబితాలో ప్రధాని మోదీ నెంబర్ 1 ప్రధాన మంత్రి

    ప్రధాన మంత్రి

    One World TB Summit: 2025 నాటికి టీబీని నిర్మూలించడమే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    'సబ్ కా ప్రయాస్'తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతోంది: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    బీజేపీకి ముందు దేశంలో 'డర్టీ పాలిటిక్స్‌', మేం వచ్చాక రాజకీయ దృక్కోణాన్ని మార్చేశాం: ప్రధాని మోదీ కర్ణాటక
    గత వారం ప్రధాని ప్రారంభించిన బెంగళూరులోని మెట్రో స్టేషన్ వర్షాలకు నీట మునిగింది బెంగళూరు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025