LOADING...
Indians In Iran: ఇరాన్‌ విడిచిపోవాలని భారత పౌరులకు సూచన.. భారతీయులకు విదేశాంగశాఖ సూచన 
భారతీయులకు విదేశాంగశాఖ సూచన

Indians In Iran: ఇరాన్‌ విడిచిపోవాలని భారత పౌరులకు సూచన.. భారతీయులకు విదేశాంగశాఖ సూచన 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 14, 2026
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లో కొనసాగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులను భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. అందుబాటులో ఉన్న రవాణా సదుపాయాలను ఉపయోగించుకుని వీలైనంత త్వరగా దేశాన్ని విడిచిపోవాలని సూచించింది. ఇదే సమయంలో భారత విదేశాంగ శాఖ కూడా కీలక సూచనలు చేసింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఇరాన్‌కు వెళ్లే ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని స్పష్టం చేసింది.

వివరాలు 

భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలి: భారత విదేశాంగ శాఖ 

మరోవైపు ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మరింత ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. ఇప్పటివరకు ఈ అల్లర్లలో 2,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ పరిస్థితుల మధ్య నిరసనలు కొనసాగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఇప్పటికే ఈ పరిణామాలపై స్పందించిన భారత విదేశాంగ శాఖ, భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది.

Advertisement