LOADING...
Mojtaba Khamenei: అజ్ఞాతం వీడనున్న ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ.. తొలి సభకు సన్నాహాలు
అజ్ఞాతం వీడనున్న ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ.. తొలి సభకు సన్నాహాలు

Mojtaba Khamenei: అజ్ఞాతం వీడనున్న ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ.. తొలి సభకు సన్నాహాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 13, 2026
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటివరకు ప్రజల ముందుకు రాని మొజ్తబా ఖమేనీ త్వరలో తొలిసారి బహిరంగ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. గత ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో అయాతొల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ దేశ అత్యున్నత నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పటి నుంచి ఆయన ఎలాంటి బహిరంగ కార్యక్రమంలోనూ కనిపించకపోవడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

వివరాలు 

జూలై 23న టెహ్రాన్‌లో స్మారక సభ

తన తండ్రి అయాతొల్లా అలీ ఖమేనీ జ్ఞాపకార్థం జూలై 23న సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు టెహ్రాన్‌లో స్మారక సభ నిర్వహించనున్నట్లు ఇరాన్ అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించినప్పటికీ, మొజ్తబా ఖమేనీ స్వయంగా హాజరవుతారా లేదా అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. అధికారిక ప్రకటనలో దివంగత అయాతొల్లా అలీ ఖమేనీని 'అమర ముజాహిద్ ఇమామ్'గా పేర్కొన్నారు.

వివరాలు 

తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరుకాని మొజ్తబా

ఇటీవల నిర్వహించిన అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ప్రార్థనలకు కూడా మొజ్తబా ఖమేనీ హాజరు కాలేదు. టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేనీ గ్రాండ్ మొసల్లాలో వేలాది మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆయన సోదరులు మొస్తఫా,మేసమ్,మసౌద్ ఖమేనీ మాత్రమే ప్రార్థనలు నిర్వహించారు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించిన అయాతొల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుమార్తె,అల్లుడు, కోడలు, 14 నెలల మనవరాలి శవపేటికలను అంత్యక్రియల సందర్భంగా పక్కపక్కనే ఉంచారు. దేశ అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ మొజ్తబా ఖమేనీ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పుడు జూలై 23న జరగనున్న స్మారక సభలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొంటారా లేదా అనే అంశంపై దేశీయంగానే కాక అంతర్జాతీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

Advertisement