LOADING...
Afghanistan: అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు.. 11 మంది చిన్నారులతో సహా పలువురు మృతి
అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు.. 11 మంది చిన్నారులతో సహా పలువురు మృతి

Afghanistan: అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు.. 11 మంది చిన్నారులతో సహా పలువురు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2026
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్ఘనిస్తాన్-పాకిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అఫ్గాన్‌లోని పౌర నివాస ప్రాంతాలపై పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడిందని తాలిబన్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు అఫ్గాన్ అధికారులు వెల్లడించారు. అఫ్గాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఖోస్ట్,కునార్,పక్తికా ప్రావిన్స్‌లలోని పౌరుల నివాసాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ బాంబు దాడులు నిర్వహించింది. ఈ ఘటనలో 11మంది అమాయక చిన్నారులు,ఓ మహిళ,ఓ వృద్ధుడు మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు. మరో 14మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. పౌర ప్రాంతాలపై జరిగిన ఈ దాడులతో అఫ్గాన్‌లో ఆందోళన నెలకొంది. అయితే ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అఫ్గాన్‌లో పాక్ దాడులు

Advertisement