LOADING...
Trump: 37ఏళ్ల తర్వాత కొత్త ఎయిర్ ఫోర్స్ వన్‌.. తొలిసారి ప్రయాణించిన ట్రంప్
37ఏళ్ల తర్వాత కొత్త ఎయిర్ ఫోర్స్ వన్‌.. తొలిసారి ప్రయాణించిన ట్రంప్

Trump: 37ఏళ్ల తర్వాత కొత్త ఎయిర్ ఫోర్స్ వన్‌.. తొలిసారి ప్రయాణించిన ట్రంప్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2026
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపు 37 ఏళ్ల తర్వాత ఆధునికీకరించిన కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో తొలిసారి ప్రయాణించారు. నార్త్ డకోటాలోని థియోడర్ రూజ్‌వెల్ట్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ఈ కొత్త అధ్యక్ష విమానంలో చేరుకున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత సేవల్లోకి వచ్చిన ఈ కొత్త విమానంలో ఇదే తన తొలి ప్రయాణమని ట్రంప్ తెలిపారు. మెడోరాలో నిర్వహించిన సభలో మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ,"37 ఏళ్ల తర్వాత ఎయిర్ ఫోర్స్ వన్ పేరుతో కొత్త ప్రత్యేక విమానంలో తొలిసారి ప్రయాణిస్తున్నాను.ఇది అద్భుతమైన విమానం"అని వ్యాఖ్యానించారు. తాను ఎంతో అభిమానించే మాజీ అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్‌కు గౌరవ సూచకంగానే ఈ పర్యటన చేపట్టినట్లు చెప్పారు.

వివరాలు 

వైట్‌హౌస్ నుంచి రూజ్‌వెల్ట్ మెడల్ ఆఫ్ ఆనర్‌ లైబ్రరీకి తరలింపు

ఈ సందర్భంగా వైట్‌హౌస్‌లోని రూజ్‌వెల్ట్ రూమ్‌లో భద్రపరిచిన థియోడర్ రూజ్‌వెల్ట్‌కు చెందిన కాంగ్రెషనల్ మెడల్ ఆఫ్ హానర్‌ను ట్రంప్ స్వయంగా లైబ్రరీకి అందజేశారు. థియోడర్ రూజ్‌వెల్ట్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తొలి సిట్టింగ్ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మరో రికార్డును నెలకొల్పారు. ఈ వేడుకకు ఆతిథ్యం ఇచ్చిన ఇంటీరియర్ సెక్రటరీ డగ్ బర్గమ్ దీనిని "చారిత్రక ఘట్టం"గా అభివర్ణించారు. లైబ్రరీ ప్రారంభమైన అనంతరం సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. థియోడర్ రూజ్‌వెల్ట్ రచించిన ప్రసిద్ధ "మ్యాన్ ఇన్ ది అరీనా" వ్యాసాన్ని ట్రంప్ చదివిన రికార్డింగ్‌ను సందర్శకులు వినే అవకాశం కల్పించారు.

వివరాలు 

250వ వార్షికోత్సవ వేడుకల నేపథ్యంలో ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యత

అలాగే లైబ్రరీ తొలి ఏడాది ప్రదర్శనల నిర్వహణ కోసం నేషనల్ ఎండోమెంట్ ఫర్ హ్యుమానిటీస్ ద్వారా 7,50,000 డాలర్ల ఫెడరల్ గ్రాంట్‌ను ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడి కోసం ఉపయోగిస్తున్న విమానాలు మూడు దశాబ్దాలుగా సేవలందిస్తున్నాయి. సాధారణ వాణిజ్య విమానాలను అత్యంత భద్రతా ప్రమాణాలతో అధ్యక్ష విమానాలుగా మార్చడం క్లిష్టమైన ప్రక్రియ కావడంతో, ఈ ఆధునికీకరణ పనులు అనేక సంవత్సరాల పాటు కొనసాగాయి. అమెరికా 250వ వార్షికోత్సవ వేడుకల నేపథ్యంలో ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.

Advertisement