Loading...
qatar: హర్మూజ్ ఉద్రిక్తతల ప్రభావం.. సముద్ర రవాణా నిలిపేసిన ఖతార్,ఇరాన్‌పై ఒమన్ ఆగ్రహం
ఇరాన్‌పై ఒమన్ ఆగ్రహం

qatar: హర్మూజ్ ఉద్రిక్తతల ప్రభావం.. సముద్ర రవాణా నిలిపేసిన ఖతార్,ఇరాన్‌పై ఒమన్ ఆగ్రహం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 13, 2026
01:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న దాడులు, ప్రతిదాడుల కారణంగా పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగడంతో గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇరాన్ మరోసారి హోర్మూజ్ జలసంధిని మూసివేయడం, అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతుండటంతో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. దీంతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతాపరమైన పరిస్థితులపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఖతార్ కీలక నిర్ణయం తీసుకోగా, ఒమన్ కూడా ఇరాన్ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

వివరాలు 

సముద్ర కార్యకలాపాలకు తాత్కాలిక విరామం.. ఖతార్ ఆదేశాలు

హోర్మూజ్ జలసంధి పరిసరాల్లో భద్రతా పరిస్థితులు విషమించడంతో ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఖతార్ ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.

తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తమ సముద్ర పరిధిలోని అన్ని వాణిజ్య సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నౌకల యాజమాన్యాలకు సూచించింది.

వాణిజ్య నౌకలతో పాటు విహార నౌకలు, సాధారణ చేపల వేట బోట్లు కూడా ప్రస్తుతం రేవులను వీడరాదని స్పష్టం చేసింది.

పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది.

వివరాలు 

దోహాపై క్షిపణుల దాడి.. అప్రమత్తమైన ఖతార్

ఆదివారం ఉదయం ఖతార్ రాజధాని దోహాను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు సమాచారం.

అయితే ఖతార్ వైమానిక రక్షణ వ్యవస్థ వేగంగా స్పందించి వాటిలో కొన్ని క్షిపణులను గగనతలంలోనే ధ్వంసం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

క్షిపణుల శకలాలు కిందపడటంతో పలువురు పౌరులు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ఈ ఘటన అనంతరం ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు తమ సాయుధ దళాలు పూర్తి సన్నద్ధతతో ఉన్నాయని ఖతార్ ప్రభుత్వం ప్రకటించింది.

ADVERTISEMENT

వివరాలు 

ఇరాన్ చర్యలు బాధ్యతారాహిత్యమే.. ఒమన్ ఘాటు స్పందన

ఇక ఇరాన్ చర్యలపై ఒమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని చెబుతూ తమ భూభాగంపై బాంబులు ప్రయోగించడాన్ని ఒమన్ తీవ్రంగా ఖండించింది.

ఈ విషయాన్ని ఒమన్‌లోని ఇరాన్ రాయబారికి సామాజిక మాధ్యమాల ద్వారా అధికారికంగా తెలియజేసింది.

'ఇరాన్ చేపడుతున్న బాధ్యతారాహిత్యమైన చర్యలపై ఒమన్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది.

ప్రతి దేశం ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలి.

ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా అంతర్జాతీయ నిబంధనలను పాటించడం అత్యంత అవసరం' అని ఒమన్ ప్రభుత్వం అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు 

చర్చల మరుసటి రోజే ఉద్రిక్త పరిణామం

హోర్మూజ్ జలసంధి సంక్షోభంపై చర్చలు జరిపేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రికి ఒమన్ ప్రభుత్వం ఇటీవలే ఆతిథ్యం ఇచ్చింది.

అయితే ఆ చర్చలు జరిగిన మరుసటి రోజే ఇరాన్ ఒమన్ భూభాగంపై దాడికి పాల్పడిందని ఆరోపణలు రావడం, అనంతరం ఒమన్ తీవ్రస్థాయిలో స్పందిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేయడం గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగినట్లు సూచిస్తోంది.

ADVERTISEMENT