Ship hijacked: సోమాలియా తీరంలో 15 మంది భారతీయులతో ఉన్న నౌక హైజాక్
15 మంది భారతీయ సిబ్బందితో ఉన్న లైబీరియన్ జెండాతో ఉన్న ఓడ సోమాలియా తీరానికి సమీపంలో హైజాక్ అయ్యినట్లు సైనిక అధికారులు శుక్రవారం తెలిపారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి భారత నౌకాదళం యుద్ధనౌక INS చెన్నైని మోహరించిందని అధికారులు తెలిపారు. హైజాక్ చేయబడిన 'MV LILA NORFOLK' నౌకను భారత నావికాదళం నిశితంగా పరిశీలిస్తోంది. ఇండియన్ నేవీ ఎయిర్క్రాఫ్ట్ విమానం నౌకపై నిఘా ఉంచిందని, షిప్లో పరిస్థితుల్ని అంచనా వేయడానికి సిబ్బందితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసినట్లు సైనిక అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలో హైజాకింగ్ ప్రయత్నానికి సంబంధించి ఇండియన్ నేవీ మిషన్ డిప్లాయిడ్ ప్లాట్ఫారమ్లు వేగంగా స్పందించాయి.
వాణిజ్య నౌకలను హైజాక్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న సముద్ర దొంగలు
ఈ నౌకలో గురువారం సాయంత్రం సుమారు ఐదు నుండి ఆరుగురు తెలియని సాయుధ సిబ్బంది ఉనికి ఉన్నట్లు సందేశం అందింది. సోమాలియా సముద్ర తీరంలో సముద్ర దొంగలు వాణిజ్య నౌకలను హైజాక్ చేసి, వాటిని విడిపించుకునేందుకు వచ్చిన సంబంధిత యాజమాన్యం లేదా దేశాల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. 2008 నుంచి 2013 మధ్య వీరి దాడులు మరింత పెరిగాయి. అయితే ఇండియన్ నేవీ, మల్టీ-నేషనల్ మారిటైమ్ టాస్క్ఫోర్స్ ప్రయత్నంతో ఈ దాడులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.