NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / House of Horror: కరోనా భయంతో నాలుగేళ్లు గదిలోనే ముగ్గురు పిల్లలు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
    తదుపరి వార్తా కథనం
    House of Horror: కరోనా భయంతో నాలుగేళ్లు గదిలోనే ముగ్గురు పిల్లలు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
    కరోనా భయంతో నాలుగేళ్లు గదిలోనే ముగ్గురు పిల్లలు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

    House of Horror: కరోనా భయంతో నాలుగేళ్లు గదిలోనే ముగ్గురు పిల్లలు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 04, 2025
    10:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కరోనా పేరు వినగానే ఇప్పటికీ కొందరికి వెన్నులో వణుకు పుడుతుంది. ఈ మహమ్మారి ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

    అప్పట్లో మందు లేకపోవడంతో లాక్‌డౌన్‌ల ద్వారా స్వీయ నియంత్రణే చికిత్సగా మారింది. బయటకు ఒక్క అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది.

    తర్వాత వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో లాక్‌డౌన్‌లు క్రమంగా ఎత్తివేశారు. అయితే కొంతమంది కరోనా భయాన్ని ఇంకా మరిచిపోలేకపోయారు.

    అందుకే బయట సమాజం సాధారణ స్థితికి చేరినా, వారు ఇంట్లోనే తామిని తామే బంధించుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి.

    ఇలాంటి ఒక్క దుర్ఘటన స్పెయిన్‌లో ఇటీవల వెలుగుచూసింది. కరోనా భయంతో తల్లిదండ్రులు తమ ముగ్గురు పిల్లలను నాలుగేళ్లుగా ఒక గదిలో బంధించి ఉంచారు.

    Details

    తల్లిదండ్రులపై మానసిక వేధింపుల అభియోగాల కేసు

    స్పానిష్ పోలీసుల జోక్యంతో ఆ పిల్లలకు చివరకు విముక్తి లభించింది.

    స్పెయిన్‌లో నివాసముంటున్న జర్మన్‌ దంపతులకు 10 ఏళ్ల ఓ బాలుడు, 8 ఏళ్ల కవలలు ఉన్నారు. డిసెంబర్ 2021 నుంచి ఈ ముగ్గురు పిల్లలు బయటకు రావడంలేదని అధికారులు తెలిపారు.

    ఈ పరిస్థితులు బయటపడిన తర్వాత, స్పానిష్ పోలీసులు ఆ ఇంటిని 'భయానక గృహం'గా అభివర్ణించారు.

    తల్లిదండ్రులు పిల్లలపై ఫేస్‌మాస్క్‌లు ధరించమని బలవంతం పెట్టినట్లు సమాచారం.

    దీంతో తల్లిదండ్రులపై మానసిక వేధింపుల అభియోగాలు నమోదు చేశారు.

    ప్రస్తుతం పిల్లలను సంరక్షణ కేంద్రానికి తరలించి, వైద్య సహాయం అందిస్తున్నారు. వారి మానసిక ఆరోగ్యాన్ని పునరుద్ధరించేందుకు కౌన్సిలింగ్‌ సేవలు కూడా అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రపంచం

    తాజా

    Motivation : ప్రయత్నం నీదైతే… గెలుపు కూడా నీదే! జీవితం
    Kiran Abbavaram: తండ్రైన మరో నటుడు .. మగబిడ్డకు జన్మనిచ్చిన రహస్య .. ఫొటో షేర్‌ చేసిన నటుడు కిరణ్ అబ్బవరం
    Bitcoin: దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. 1,11,000 డాలర్లకు బిట్‌కాయిన్‌ క్రిప్టో కరెన్సీ
    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్

    ప్రపంచం

    Ranjani Srinivasan: అమెరికా వీసా రద్దు.. రంజని శ్రీనివాసన్‌పై ఉన్న ఆరోపణలేమిటీ? అమెరికా
    US Storm: అమెరికాలో భీకర తుఫాను.. 34 మంది మృతి  అమెరికా
    Pakistan: బలూచిస్థాన్‌లో మిలిటరీ కాన్వాయ్‌పై బాంబు దాడి.. ఐదుగురు సైనికులు మృతి పాకిస్థాన్
    Nightclub fire: నైట్‌ క్లబ్‌లో భారీగా మంటలు.. 50మందికి పైగా దుర్మరణం అగ్నిప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025