NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / నైజీరియా: నదిలో పడవ బోల్తా పడి 103 మంది మృతి 
    తదుపరి వార్తా కథనం
    నైజీరియా: నదిలో పడవ బోల్తా పడి 103 మంది మృతి 
    నైజీరియా: నదిలో పడవ బోల్తా పడి 103 మంది మృతి

    నైజీరియా: నదిలో పడవ బోల్తా పడి 103 మంది మృతి 

    వ్రాసిన వారు Stalin
    Jun 14, 2023
    09:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర నైజీరియాలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న పడవ బోల్తా పడడంతో చిన్నారులు సహా 103 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

    రాష్ట్ర రాజధాని ఇలోరిన్ నుంచి 160 కిలోమీటర్ల (100 మైళ్ళు) దూరంలో ఉన్న క్వారా రాష్ట్రంలోని పటేగి జిల్లాలో గల నైజర్ నదిలో సోమవారం పడవ బోల్తాపడినట్లు అధికారులు తెలిపారు.

    ప్రమాద సమయంలో పడవలో 300 మంది వరకు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

    నదిలో పడిన వారి కోసం పోలీసులతో పాటు స్థానికులు కూడా ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటి వరకు 100మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.

    ప్రమాదం

    మృతుల సంఖ్య పెరిగే అవకాశం

    నీటిలో మునిగిపోయిన వారిలో ఎక్కువ మంది బంధువులే ఉన్నారు. వారందరూ వివాహానికి హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో ఈ ఘటన జరిగింది.

    పడవలో కూడా ఎక్కువ సంఖ్యలో జనం ఉండటంతో పాటు, అది నీటి లోపల ఉన్న పెద్ద దుంగను ఢీకొట్టి రెండుగా చీలిపోయిందని అధికారులు చెబుతున్నారు.

    సహాయక చర్యల్లో భాగంగా మరిన్ని మృతదేహాలను వెలికి తీసే అవకాశం ఉంది. రెస్క్యూ ఆపరేషన్ బుధవారం రాత్రి వరకు కొనసాగుతుందని పోలీసు అధికార ప్రతినిధి అజయ్ తెలిపారు.

    చాలా ఏళ్లలో తాము చూసిన ఘోరమైన పడవ ప్రమాదం ఇదేనని స్థానికులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తాజా వార్తలు
    వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    తాజా వార్తలు

    కొత్త తరం లాంచ్ వెహికల్ కోసం మా బృందం పని చేస్తోంది: ఇస్రో చీఫ్ సోమనాథ్  ఇస్రో
    కెనడాలో చెలరేగిన కార్చిచ్చుతో తూర్పు అమెరికా బేజార్; న్యూయార్క్‌ను కమ్మేసిన పొగ  అమెరికా
    రహస్య పత్రాల కేసులో డొనాల్డ్ ట్రంప్‌‌పై అభియోగాలు; నేరం రుజువైతే 100ఏళ్ల జైలుశిక్ష  డొనాల్డ్ ట్రంప్
    దిల్లీ: విస్తారా విమానంలో 'బాంబు' సంభాషణ, ప్రయాణికుడి అరెస్టు  విస్తారా

    వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    అలబామా: పుట్టినరోజు వేడుకల్లో కాల్పుల కలకలం; నలుగురు మృతి అమెరికా
    రంజాన్ దాతృత్వ పంపిణీలో తొక్కిసలాట, 85మంది మృతి  తాజా వార్తలు
    సొంత నగరంపైనే రష్యా యుద్ధవిమానం దాడి; డ్యామిట్ ఎలా జరిగింది?  రష్యా
    లక్ష మంది లోపే జనాభా ఉన్న ఈ దేశాల గురించి తెలుసా? వాటికన్ సిటీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025