NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / oil prices: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు చమురు ధరలను ఎందుకు పెంచుతున్నాయి?.. ఇది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
    తదుపరి వార్తా కథనం
    oil prices: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు చమురు ధరలను ఎందుకు పెంచుతున్నాయి?.. ఇది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
    ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు చమురు ధరలను ఎందుకు పెంచుతున్నాయి?

    oil prices: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు చమురు ధరలను ఎందుకు పెంచుతున్నాయి?.. ఇది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 04, 2024
    02:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని లెబనాన్‌లో ఇజ్రాయెల్ సేనలు చేపట్టిన దాడులకు ప్రతిస్పందనగా, ఇరాన్ బుధవారం భారీ ఖండాంతర క్షిపణులను ప్రయోగించిన సంగతి తెలిసిందే.

    ఈ క్షిపణులను ఇజ్రాయెల్ గగనతలంలోనే కూల్చివేసినప్పటికీ, ఈ పరిణామం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

    యుద్ధ వాతావరణం ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

    ఈ ఉద్రిక్తతల ప్రభావం చమురు ధరలపై తీవ్రంగా పడింది. గత రెండు రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు గణనీయంగా పెరిగి, రెండు వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.

    భారతదేశంలో ఇప్పటికిప్పుడు ఇంధన ధరలు పెరగకపోయినప్పటికీ,పరిస్థితి ఇలాగే కొనసాగితే పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన క్షిపణుల దాడులు చమురు ధరలను మరింతగా పెంచాయన్నారు.

    వివరాలు 

    భారతదేశంపై ప్రభావం ఎందుకు? 

    ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు జరగనున్నాయనే వార్తలు ముందుగా వెలువడటంతోనే చమురు మార్కెట్‌లో ప్రతికూల ప్రభావం కనిపించింది.

    పశ్చిమాసియాలో యుద్ధం తలెత్తితే, చమురు సరఫరా తగ్గిపోవచ్చన్న భయాలతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

    ఈ పరిణామం భారతదేశంపై ప్రభావం చూపడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు, ఎందుకంటే భారత్ ఎక్కువగా మధ్య ఆసియా దేశాల నుంచి చమురు దిగుమతులపై ఆధారపడుతోంది.

    చమురును ఎక్కువ రేటుకు కొనుగోలు చేయాల్సి వస్తే, ఆ భారాన్ని వాహనదారులపై మోపాల్సి వస్తుందని, తద్వారా ఇంధన ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    వివరాలు 

    మధ్యప్రాచ్య దేశాలతో భారత్‌కు వాణిజ్య సంబంధాలు చాలా కీలకం

    ఇది కాకుండా, మధ్యప్రాచ్య దేశాలతో భారత్‌కు వాణిజ్య సంబంధాలు చాలా కీలకం. భారత్ యంత్రాలు, ఫార్మాస్యూటికల్స్ వంటి ఉత్పత్తులను ఆ దేశాలకు ఎగుమతి చేస్తూ, చమురు, సహజ వాయువు, ఎరువులు వంటి ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చమురు

    తాజా

    Mohmand Dam: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మోహ్మండ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుపై చైనా దృష్టి చైనా
    ACUTE FOOD INSECURITY IN PAKISTAN: ఆహార సంక్షోభంలో పాక్‌.. 11మిలియన్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం: FAO పాకిస్థాన్
    Pakistan:పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు   జ్యోతి మల్హోత్రా
    Supreme Court: కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి విజయ్ షాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం సుప్రీంకోర్టు

    చమురు

    వినియోగదారులకు గుడ్‌న్యూస్; వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గాయ్ వాణిజ్య సిలిండర్
    గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్: రూ. 171.50 తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధర వాణిజ్య సిలిండర్
    నగదు కొరతతో మే 3, 4తేదీల్లో గో ఫస్ట్ విమాన సర్వీసుల రద్దు విమానం
    పెట్రోల్, డీజిల్‌ను రూ. 1 తక్కువే అమ్ముతాం: నయారా ఎనర్జీ  పెట్రోల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025