Page Loader
oil prices: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు చమురు ధరలను ఎందుకు పెంచుతున్నాయి?.. ఇది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు చమురు ధరలను ఎందుకు పెంచుతున్నాయి?

oil prices: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు చమురు ధరలను ఎందుకు పెంచుతున్నాయి?.. ఇది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 04, 2024
02:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని లెబనాన్‌లో ఇజ్రాయెల్ సేనలు చేపట్టిన దాడులకు ప్రతిస్పందనగా, ఇరాన్ బుధవారం భారీ ఖండాంతర క్షిపణులను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ క్షిపణులను ఇజ్రాయెల్ గగనతలంలోనే కూల్చివేసినప్పటికీ, ఈ పరిణామం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. యుద్ధ వాతావరణం ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉద్రిక్తతల ప్రభావం చమురు ధరలపై తీవ్రంగా పడింది. గత రెండు రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు గణనీయంగా పెరిగి, రెండు వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. భారతదేశంలో ఇప్పటికిప్పుడు ఇంధన ధరలు పెరగకపోయినప్పటికీ,పరిస్థితి ఇలాగే కొనసాగితే పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన క్షిపణుల దాడులు చమురు ధరలను మరింతగా పెంచాయన్నారు.

వివరాలు 

భారతదేశంపై ప్రభావం ఎందుకు? 

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు జరగనున్నాయనే వార్తలు ముందుగా వెలువడటంతోనే చమురు మార్కెట్‌లో ప్రతికూల ప్రభావం కనిపించింది. పశ్చిమాసియాలో యుద్ధం తలెత్తితే, చమురు సరఫరా తగ్గిపోవచ్చన్న భయాలతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ పరిణామం భారతదేశంపై ప్రభావం చూపడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు, ఎందుకంటే భారత్ ఎక్కువగా మధ్య ఆసియా దేశాల నుంచి చమురు దిగుమతులపై ఆధారపడుతోంది. చమురును ఎక్కువ రేటుకు కొనుగోలు చేయాల్సి వస్తే, ఆ భారాన్ని వాహనదారులపై మోపాల్సి వస్తుందని, తద్వారా ఇంధన ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు 

మధ్యప్రాచ్య దేశాలతో భారత్‌కు వాణిజ్య సంబంధాలు చాలా కీలకం

ఇది కాకుండా, మధ్యప్రాచ్య దేశాలతో భారత్‌కు వాణిజ్య సంబంధాలు చాలా కీలకం. భారత్ యంత్రాలు, ఫార్మాస్యూటికల్స్ వంటి ఉత్పత్తులను ఆ దేశాలకు ఎగుమతి చేస్తూ, చమురు, సహజ వాయువు, ఎరువులు వంటి ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది.