LOADING...
Autonomous Cars: కనెక్టెడ్, ఆటోనమస్ కార్లకు సైబర్ సెక్యూరిటీ, OTA అప్‌డేట్ నిబంధనలు..
కనెక్టెడ్, ఆటోనమస్ కార్లకు సైబర్ సెక్యూరిటీ, OTA అప్‌డేట్ నిబంధనలు..

Autonomous Cars: కనెక్టెడ్, ఆటోనమస్ కార్లకు సైబర్ సెక్యూరిటీ, OTA అప్‌డేట్ నిబంధనలు..

వ్రాసిన వారు Moogati Shabari
Jun 27, 2026
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

కనెక్టెడ్, ఆటోనమస్ వాహనాల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే, తొలిసారిగా కొన్ని రకాల మోటారు వాహనాలకు సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ నిర్వహణ చట్టబద్ధమైన తప్పనిసరి నిబంధనలుగా మారనున్నాయి. ఇప్పటికే యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియాలో అమల్లో ఉన్న నియంత్రణ ప్రమాణాల దిశగా భారత్ కూడా అడుగులు వేస్తోంది.

వివరాలు

30 రోజుల పాటు ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణ..

ఈ ముసాయిదా ప్రకారం, సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్-1989లో కొత్తగా రూల్ 125-T, రూల్ 125-Uలను చేర్చాలని ప్రతిపాదించారు. తుది నిర్ణయం తీసుకునే ముందు ఈ ముసాయిదాపై 30 రోజుల పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించనున్నారు. రూల్ 125-T సైబర్ సెక్యూరిటీకి సంబంధించినది. కనీసం ఒక ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ (ECU) ఉన్న M, N, T కేటగిరీల వాహనాలు (ప్రయాణికుల వాహనాలు, సరుకు రవాణా వాహనాలు, ట్రాక్టర్లు), అలాగే లెవల్-3 లేదా అంతకంటే ఎక్కువ ఆటోమేషన్ కలిగిన L7 కేటగిరీ వాహనాలు AIS-189 ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CSMS)ను అమలు చేయాల్సి ఉంటుంది.

వివరాలు

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లకు సంబంధించి కీలక ప్రకటన..

రూల్ 125-U సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లకు సంబంధించినది. ఇది M, N, T, A, C కేటగిరీల వాహనాలకు వర్తిస్తుంది. ఈ నిబంధనల ప్రకారం AIS-190 ప్రమాణాలను అనుసరించాలి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు ఎలా అందించాలి, వాటిని ఎలా పర్యవేక్షించాలనే అంశాలను సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (SUMS) ద్వారా నిర్వహించాల్సి ఉంటుంది. భారతీయ ప్రమాణాల బ్యూరో (BIS) అధికారిక ప్రమాణాలను విడుదల చేసే వరకు AIS-189, AIS-190 ప్రమాణాలే అమల్లో ఉంటాయి. అనంతరం BIS ప్రమాణాలు వాటి స్థానాన్ని భర్తీ చేస్తాయి. ఈ నిర్ణయంతో ఐక్యరాజ్యసమితి (UN) రూపొందించిన నియంత్రణ వ్యవస్థకు అనుగుణంగా భారత్ కూడా ముందుకు సాగుతోంది.

Advertisement

వివరాలు

2029నాటికి ఆ నిబంధనలు తప్పనిసరి..

ఈ నిబంధనలు అన్ని వాహనాలకు ఒకేసారి అమలు కాకుండా, ప్రమాద స్థాయిని బట్టి దశలవారీగా అమల్లోకి రానున్నాయి. లెవల్-3 లేదా అంతకంటే ఎక్కువ ఆటోమేషన్ కలిగిన వాహనాలకు తొలి గడువు నిర్ణయించారు. కొత్త మోడళ్లకు అక్టోబర్ 2026 నుంచి, ఇప్పటికే ఉన్న మోడళ్లకు ఏప్రిల్ 2027 నుంచి ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఓవర్-ది-ఎయిర్ (OTA) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సదుపాయం ఉన్న వాహనాలకు ఏప్రిల్ 2028, అక్టోబర్ 2028 వరకు గడువు ఇచ్చారు. OTA ఉన్నా లేకపోయినా, ఏ రూపంలోనైనా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సామర్థ్యం ఉన్న మిగతా అన్ని వాహనాలు అక్టోబర్ 2029 నాటికి ఈ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది.

Advertisement