NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం
    తదుపరి వార్తా కథనం
    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం
    హై-స్పీడ్ మోటార్‌వే ప్రాజెక్టులు రవాణా నాణ్యతను పెంచాయి

    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 03, 2023
    06:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ(MRTH) జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై వేగ పరిమితులను పెంచాలని ప్రతిపాదించింది. ప్రతిపాదిత స్పీడ్ రివిజన్ భారతదేశ రవాణా మౌలిక సదుపాయాల భద్రతా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగం.

    కొత్త హై-స్పీడ్ మోటార్‌వే ప్రాజెక్టులు భారతదేశ రవాణా నాణ్యతను బాగా మెరుగుపరిచాయి. 2018లో, కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఎక్స్‌ప్రెస్‌వేలకు 120కిమీ/గం, జాతీయ రహదారులకు 100 కిమీ/గం వేగ పరిమితిని పెంచింది. అయితే, ఆగస్ట్ 2021లో మద్రాస్ హైకోర్టు భద్రతా సమస్యలను పేర్కొంటూ నోటిఫికేషన్‌ను తిరస్కరించింది.

    MRTH గత సంవత్సరం సుప్రీంకోర్టులో ఈ ఉత్తర్వును అప్పీల్ చేసింది. ఇప్పుడు పరిష్కారం కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కొత్త నిబంధనలను చర్చించాలని ఆలోచిస్తుంది.

    కేంద్రం

    రాబోయే ఆర్థిక సంవత్సరంలో హైవే నిర్మాణానికి రోజుకు 60కిమీ లక్ష్యాన్ని MORTH నిర్దేశించుకుంది

    న్యూఢిల్లీలో ఈమధ్య జరిగిన జెట్‌వర్క్ స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ సమ్మిట్ 2023లో, హై-స్పీడ్ మొబిలిటీ కోసం ఉద్దేశించిన కొత్త రహదారులపై తక్కువ పరిమితులు ప్రయాణికులకు ఇబ్బందిగా మారాయని గడ్కరీ అన్నారు.

    ప్రతిపాదిత వేగ పరిమితులను మంత్రిత్వ శాఖ ఇంకా వెల్లడించనప్పటికీ, కొత్త నిబంధనలు యాక్సెస్ కంట్రోల్ హైవేలు, 8-లేన్, 6-లేన్, 4-లేన్,2-లేన్ హైవేలతో సహా వివిధ రకాల మోటర్‌వేలకు వర్తిస్తాయి.

    MORTH రాబోయే ఆర్థిక సంవత్సరంలో హైవే నిర్మాణానికి రోజుకు 60కిమీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే, భారతదేశంలో కోవిడ్-19 ప్రభావం, మిగతా సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రోజుకు 40 కి.మీ హైవే నిర్మాణాన్ని సాధించాలని కేంద్రం భావిస్తోందని గడ్కరీ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    నితిన్ గడ్కరీ
    కేంద్రమంత్రి

    తాజా

    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్

    ఆటో మొబైల్

    ఎట్టకేలకు Purosangue కార్ ధరను ప్రకటించిన ఫెరారీ సంస్థ ఇటలీ
    భారతీయ మార్కెట్లోకి తిరిగి రానున్న బజాజ్ పల్సర్ 220 F ప్రారంభమైన బుకింగ్స్ బైక్
    హెలికాప్టర్ కంటే వేగంగా ఎగిరే ఎలక్ట్రిక్ టాక్సీ వచ్చేసింది..! ఎలక్ట్రిక్ వాహనాలు
    రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 లైట్నింగ్ బైక్ టాప్ ఫీచర్లు బైక్

    నితిన్ గడ్కరీ

    2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ ఆటో మొబైల్
    'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్ బీజేపీ
    మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్ టాటా

    కేంద్రమంత్రి

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    బీజేపీ యాక్షన్ ప్లాన్ షూరూ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కర్ణాటక
    2 కొత్త న్యాయమూర్తులతో 34 మంది పూర్తి బలాన్ని తిరిగి పొందిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025