Loading...
E20: పెట్రోల్ వాహనాలపై తగ్గుతున్న ఆసక్తి.. డీలర్‌షిప్‌లలో పెరుగుతున్న స్టాక్.. CNG, EVల వైపు కొనుగోలుదారుల చూపు
పెట్రోల్ వాహనాలపై తగ్గుతున్న ఆసక్తి.. డీలర్‌షిప్‌లలో పెరుగుతున్న స్టాక్.. CNG, EVల వైపు కొనుగోలుదారుల చూపు

E20: పెట్రోల్ వాహనాలపై తగ్గుతున్న ఆసక్తి.. డీలర్‌షిప్‌లలో పెరుగుతున్న స్టాక్.. CNG, EVల వైపు కొనుగోలుదారుల చూపు

వ్రాసిన వారు Moogati Shabari
Aug 08, 2026
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ప్యాసింజర్ వాహనాల డీలర్‌షిప్‌ల వద్ద వాహనాల స్టాక్ మరోసారి పెరుగుతోంది. అయితే ఈసారి తక్కువ డిమాండ్ కారణంగా కాకుండా.. వినియోగదారులు పెట్రోల్ వాహనాల నుంచి వేగంగా ఇతర ఇంధన వాహనాల వైపు మళ్లుతుండటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎథనాల్ కలిపిన పెట్రోల్‌పై కొనుగోలుదారుల్లో పెరుగుతున్న ఆందోళన CNG, ఎలక్ట్రిక్ కార్ల వంటి ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల డిమాండ్‌ను పెంచుతోందని డీలర్లు చెబుతున్నారు. అదే సమయంలో డీజిల్ వాహనాలకు కూడా అనూహ్యంగా మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. దీంతో మొత్తం రిటైల్ డిమాండ్ బాగానే ఉన్నప్పటికీ.. డీలర్‌షిప్‌ల వద్ద పెట్రోల్ వాహనాల పాత స్టాక్ పేరుకుపోతోంది.

వివరాలు

డీలర్‌షిప్‌ల వద్ద వాహనాల స్టాక్..

ఫెడరేషన్ ఆఫ్ ఆటో మొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) ప్రకారం.. డీలర్‌షిప్‌లలో ఉన్న ప్యాసింజర్ వాహనాల్లో నాలుగో వంతుకు పైగా 60 నుంచి 70 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా అమ్ముడుపోకుండా ఉన్నాయి.

సాధారణంగా డీలర్‌షిప్‌ల వద్ద వాహనాల స్టాక్ 30 నుంచి 33 రోజుల సైకిల్‌లో ఉండేది.

అయితే FADA సుమారు 21 రోజుల స్టాక్‌ను మాత్రమే నిర్వహించాలని సూచిస్తోంది.

జూలైలో ఆటోమొబైల్ కంపెనీలు డీలర్లకు పంపిన వాహనాల సంఖ్య.. వినియోగదారులు కొనుగోలు చేసిన వాహనాల కంటే గణనీయంగా ఎక్కువగా ఉంది.

జూలైలో కంపెనీల నుంచి డీలర్లకు 4.69 లక్షల వాహనాలు పంపించగా.. రిటైల్ విక్రయాలు 4.16 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. దీంతో 52 వేలకుపైగా వాహనాల వ్యత్యాసం ఏర్పడింది.

వివరాలు

ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల వాటా 40.59 శాతం..

కంపెనీలు డీలర్లకు పంపిన వాహనాలు, వాస్తవంగా కూడా స్టాక్ పెరగడానికి కారణమవుతోంది.

అయితే ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల వైపు వినియోగదారులు వేగంగా మళ్లడం కూడా ఈ పరిస్థితికి సమానంగా కీలక కారణమని డీలర్లు చెబుతున్నారు.

గతేడాది పెట్రోల్, ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల మార్కెట్ వాటా మధ్య 13 శాతం తేడా ఉండేదని FADA వైస్ ప్రెసిడెంట్ సాయి గిరిధర్ తెలిపారు.

ప్రస్తుతం ఈ తేడా కేవలం 1 శాతానికి తగ్గిందన్నారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల వాటా 40.59 శాతంగా ఉండగా.. పెట్రోల్ వాహనాల వాటా 41.68 శాతంగా ఉంది.

ADVERTISEMENT

వివరాలు

పెరిగిన డీజిల్ వాటా శాతం..

ఇదిలా ఉంటే.. డీజిల్ వాహనాలు మాత్రం తమ మార్కెట్ వాటాను నిలబెట్టుకుంటున్నాయి.

జూలైలో డీజిల్ వాహనాల మార్కెట్ వాటా 17.73 శాతంగా నమోదైంది. అంతకుముందు నెలతో పోలిస్తే ఇది 1.4 శాతం పాయింట్లు పెరిగింది.

E20 పెట్రోల్‌పై కొనుగోలుదారుల్లో పెరుగుతున్న ఆందోళన కూడా డీజిల్ డిమాండ్ మళ్లీ పెరగడానికి ఒక కారణమని సాయి గిరిధర్ తెలిపారు.

E20పై ఆందోళనలు పెరిగిన తర్వాత డీజిల్ వాహనాలపై విచారణలు, ఆసక్తి పెరిగిందని ఆయన చెప్పారు.

ప్రస్తుతం డీజిల్‌లో ఇలాంటి ఎథనాల్ మిశ్రమం లేకపోవడంతో కొనుగోలుదారులు మళ్లీ డీజిల్ కార్లను పరిశీలిస్తున్నారని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు

వాటిపై మరోసారి దృష్టి పెట్టాల్సిన అవసరం..

మొత్తంగా చూస్తే.. దేశంలో ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ ఇప్పటికీ బలంగానే ఉన్నప్పటికీ, వినియోగదారుల ఇంధన ప్రాధాన్యతలు వేగంగా మారుతున్నాయి.

ఈ నేపథ్యంలో వాహన తయారీ కంపెనీలు CNG, ఎలక్ట్రిక్ వాహనాలకు అనుగుణంగా తమ ఉత్పత్తి ప్రణాళికలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.

అదే సమయంలో డీజిల్ వాహనాలకు అనూహ్యంగా మళ్లీ పెరుగుతున్న డిమాండ్, E20 పెట్రోల్‌పై ఉన్న ఆందోళనలు కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని సూచిస్తోంది.

దీంతో భవిష్యత్తులో కంపెనీలు వాహనాల ఉత్పత్తి పరిమాణాలతో పాటు.. ఏ ఇంధనంతో నడిచే వాహనాలను మార్కెట్లోకి తీసుకురావాలన్న అంశంపైనా మరోసారి దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్..

ADVERTISEMENT